సిలికానాంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో సిలికానాంద్ర ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంద్ర (యు ఎస్ ఎ ) మొదటి స్నాతకోత్సవాన్ని జనవరి 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.

సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి ఆంబులెన్స్ ప్రారంభం


కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో ఏర్పటు చేసిన మందుల షాపు, ఆంబులెన్స్ సేవలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి.చలమేశ్వర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సిలికానాంద్ర సంజీవని ఆస్పత్రిలో సేవలు ప్రారంభించిన స్పీకర్


నృత్యం పేరుతొ ప్రపంచ వ్యాప్తమైన సిలికానాంద్ర సంజీవని వైద్యశాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభపతి డా.కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంద్ర సంజీవని వైద్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మహా వైద్య శిభిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన ఎక్స్ రే ల్యాబ్ ను సభాపతి ప్రారంభించారు. సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.కోడెల మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన రూ. పది కోట్లు వీలైనంత త్వరలో వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డా.సుబ్రహ్మనేస్వరరావు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, విజయవాడ సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్ధుల సంఘం అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సూరపనేని శ్రీనివాస్, డా. అమ్మన్న , ప్రముఖ వైద్యులు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, తెదేపా మండల అద్యక్షుడు తాతా వీరదుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి తాతా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొవ్వ, పామర్రు, మచిలీపట్నం కలిదిండి, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు. డా.సుబ్రమణ్యశ్వర అమెరికాకు చెందిన యూరాలజిస్తూ డా.వేములపల్లి జగన్మోహనరావు, క్యాపిటల్ ఆసుపత్రి గుండె వ్యాధి నిపుణులు డా.భూపాల్ లతో పాటు నలభై మంది వైద్యులు సేవలందించారు. లింగమనేని రామస్వామి, కాజ చిన వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు పామర్తి శివకుమార్, పోతుల అనన్య , కిషన్, మద్దాల కామేశ్వరరావు, నాగభూషణం తదితరులు సహకరించారు.




కూచిపూడి ‘సంజీవని’ ఆసుపత్రి నిర్మాణం అద్భుతం.


యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మించిన సంజీవని ఆసుపత్రి ఒక అద్భుతమని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, దాత డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రశంసించారు. సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఆహ్వానం మేరకు డా.హనిమిరెడ్డి గురువారం నాడు ఈ ఆసుపత్రిని సందర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి భారీ ఆసుపత్రి కూచిపూడి వంటి చిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని డా. హనిమిరెడ్డి కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం డా. హనిమిరెడ్డిని ఆనంద్ ఆద్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తోండేపు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





పాఠశాల అభివృద్ధి అంటే ఇలా ఉండాలి

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్‌ ఓరియెంటల్‌ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే బోధన చేస్తూ విద్యార్థుల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాల వైఖరులు పెంపొందించేలా పాటుపడుతున్నారు. ఒకవైపు కృత్యాలు, పరిశోధనల ద్వారా తరగతి గదులను తయారు చేస్తూ మరోవైపు పాఠశాల ఆవరణను స్వచ్ఛంగా, నందనవనంగా మారుస్తున్నారు. భాషా సాంస్కృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోగశాల, సాంఘిుక శాస్త్ర విజ్ఞాన విభాగాల ఏర్పాటుతో ఇక్కడ గోడలే పాఠాలు చెబుతుంటాయ్‌. సిలికానాంధ్ర కుటుంబం దత్తత తీసుకున్న ఈ పాఠశాల ఇతర విద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
***నాలుగేళ్ల కిందట సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ ఈ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తరగతి గదులను దాతల సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
* గత రెండేళ్లుగా పాఠశాల ఆవరణను ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు. చూడగానే ఆవరణ హరితవనంలా కనిపిస్తుంది. పాఠశాలలోని మరుగుదొడ్లకు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గత ఏడాది మరమ్మతులు చేసి పచ్చదనం పెంచారు. నాలుగేళ్లుగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులచే తెలుగుభాషాదినోత్సవం, ప్రముఖ కవుల జయంతి కార్యక్రమాలు వంటి వాటితోపాటు భారతీయ సాంస్కృతిక సంప్రదాయలకు పెద్దపీట వేస్తున్నారు.
* పాఠశాలలో గత ఏడాది సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసి జిల్లా విద్యాశాఖ నుంచి ప్రశంసలను అందుకున్నారు. నవ్యాంధ్ర అమరావతిలో ఐకాన్‌ బ్రిడ్జి నమూనాలను, కూచిపూడి నృత్యభంగిమలు, ప్రముఖ చరిత్రకారుల జీవిత విశేషాలు, ప్రాచీన విశ్వవిద్యాలయాల వివరాలు, చరిత్ర, సంస్కృతి తెలిసేలా తరగతి గదిని తీర్చిదిద్దారు.
* భాషా సాంసృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోశాలలను నూతనగా ఏర్పాటుచేశారు. అందులో విభిన్న నాట్య రీతులు, కూచిపూడి నాట్యవైభవం, తెలుగు వెలుగుల పేరుతో ప్రముఖ కవులైన క్షేత్రయ్య, నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అన్నమయ్య వంటివారితోపాటు ఆధునిక కవులైన గిడుగురామ్మూర్తి, శ్రీశ్రీ వంటివారి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. భారతీయ భాషలు, తెలుగు లిపిక్రమ పరిణామ క్రమాన్ని ఇందులో పొందుపరిచారు. మౌర్యుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు చిత్రాలను ఏర్పాటు చేసి చరిత్రపై అవగాహన ఏర్పడేలా చేశారు.
* భారతీయ వైభవం పేరుతో తల్లి గర్భంలో శిశువు పురుడు పోసుకొని జన్మనిచ్చిన క్రమం.. వేదవ్యాసుని వాయు పురాణంలోని 16 శ్లోకాలకు బాపు చిత్రాలు, చాగంటి వ్యాఖ్యానాలను మాతృవందనం పేరుతో ఏర్పాటు చేశారు. వేమన పద్యాలను గోడపై లిఖించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం కొల్లి జగదీశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో విభిన్న అంశాలపై ప్రయోగశాలలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా విద్యార్థులు త్వరితగతిన జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులు అన్ని రంగాల్లో రాణించేలా తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
* కూచిపూడి రోటరీ క్లబ్‌ సభ్యుల సహకారంతో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్త చీకటిమర్ల శివరామప్రసాద్‌, ప్రభుత్వ సహకారంతో రెండు డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేసుకున్నారు.

సిలికానాంద్ర ‘సంజీవని’కి వరద కడుతున్న విరాళాలు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సంజీవని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి అమెరికాతో పాటు వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. మంగళవారం విరాళాలు దినోత్సవంగా పాటించి విరాళాలు ఇవ్వాలని సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఇచ్చిన పిలుపుకు 69వేల డాలర్లు విరాళంగా అందాయి. 549 మంది దాతల నుండి ఈ అందినట్లు ఆనంద్ ప్రకటించారు. విరాళాలు అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంజీవనికి సిఎం ద్వారా విరాళాలు అందించిన ప్రవాసులు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో దాదాపు రూ.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ సంజీవని ఆస్పత్రికి ప్రవాసుల నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. 18వ తేదీన ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు చేతుల మీదుగా పలువురు ప్రవాసులు సంజీవని ఆస్పత్రికి విరాళాలు అందజేశారు. ప్లోరిడాకు చెందిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పది లక్షల రూపాయలు, డాలస్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కోనేరు శ్రీనివాస్ ఆరు లక్షల రూపాయలు సిఎం చంద్రబాబు ద్వారా విరాళాలను అందజేశారు. వీరిరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారుల వయసు పెద్దది. కూచిపూడిలో సిలికానాంద్ర కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు విరాళం అందించారు. అమెరికాలో తాము విక్రయించి, నృత్యాలు ప్రదర్శించి, స్నేహితుల కుటుంబ సభ్యులను ఇంటికి విందుకు పిలిచి ఆస్పత్రి నిర్మాణం గురించి వివరించి విరాళాలు సేకరించారు. ఇలా ఒక్కొక్కరు రూ.పది లక్షల చొప్పున ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు.

పదో రికార్డు కైవసం చేసుకున్న కూచిభొట్ల ఆనంద్-TNI ప్రత్యేకం


ఓ వ్యక్తి రూపొందించిన ఒక వ్యవస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా కార్యకలాపాలను చేపడుతోంది. విదేశాల్లో పుట్టిన ఒక చిన్న తెలుగు సంఘం మాతృభూమిని మరచిపోకుండా సొంతగడ్డ పై చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగువారందరికి గర్వకారణంగా ఉంటున్నాయి.

*** ఉపాధి కోసం భార్యబిడ్డలతో కలిసి అమెరికా వెళ్లి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని 18ఏళ్ల క్రితం కూచిభొట్ల ఆనంద్ అనే ఒక చిన్న వ్యక్తి ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర’ అనే చిన్న సంస్థ తెలుగుజాతి గర్వించే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టకూడదు’ అనే ఆలోచన ప్రతి తెలుగు సంస్థలో రేకెత్తిస్తున్నాయి.

*** ఒకటా…రెండా…మొత్తం పది రికార్డులు…!
కూచిభొట్ల ఆనంద్ సారధ్యంలోని సిలికానాంద్ర ఇప్పటి వరకు తొమ్మిది గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 2008లో అమెరికా గడ్డపై తొలిసారిగా ఒకే వేదిక పై దాదాపు నాలుగు వందల మంది కూచిపూడి కళాకారిణిలతో చేయించిన నృత్యంతో సిలికానాంద్ర గిన్నీస్ రికార్డుల పర్వం ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ‘అన్నమయ్య లక్ష గళార్చన’, తదితర అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టి గడిచిన పదేళ్ళలో మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను కూచిభొట్ల ఆనంద్ నెలకొల్పారు.

*** కూచిపూడి ‘సంజీవని’తో మరో రికార్డు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజల భాగస్వామ్యంతో కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని వైద్యశాల ఆనంద్ సాధించిన మరో రికార్డుగా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో 50కోట్ల ఖర్చుతో కూచిపూడి వంటి చిన్న గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రి తెలుగువారికే కాదు యావత్ భారత జాతికే గర్వకారణం అనటంలో సందేహం లేదు.

*** సంజీవని ఆస్పత్రి నిర్మాణంలో అన్నీ వింతలే?!
వాస్తవానికి కూచిపూడి నాట్యం రూపుదిద్దుకొన్న గ్రామంలో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించే బాద్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూచిభొట్ల ఆనంద్ కు నాలుగేళ్ళ క్రితం అప్పగించారు. ఈ పని మీద కూచిపూడి వెళ్ళిన ఆనంద్ కు, ఆయన అనుచర బృందానికి అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా అక్కడి ప్రజలు ఆయనకు సహకరించడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఉన్న కూచిపూడి నాట్యాచార్యులు కొంతమంది ఆనంద్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

** ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని…
కూచిపూడిలో తొలుత తనకు ఎదురైన ఇబ్బందులను కూచిభొట్ల ఆనంద్ తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకున్నారు. పంచె పైకి ఎగగట్టి జోలె పట్టుకున్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దానగుణం ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరిని కలిశారు. కూచిపూడి గ్రామ అభివృద్దికి కూచిభొట్ల ఆనంద్ చేపట్టిన నిధుల వేట పలువురిని కదిలించివేసింది. కరడుగట్టిన మీడియా అధినేతగా పేరుపొందిన రవిప్రకాష్ లో ఉన్న మరొక కోణాన్ని ఆనంద్ బయటకు తీసుకువచ్చారు. సంజీవని నిర్మాణానికి రవిప్రకాష్ సొంతగా నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. మరొక పదికోట్ల విరాళాన్ని తన టీవీ9 ద్వారా ప్రజల నుండి ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పించారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంజీవని నిర్మాణంలో రైతు కూలీలు, రిక్షా కార్మికులు, పదవీవిరమణ చేసిన వృద్దులు, షాపు గుమ్మస్తాలు తదితర వర్గాల వారిని సంజీవని ఆకర్షించింది. వంద రూపాయల నుండి కోట్ల వరకు విరాళాలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున తరలిరావటం పెద్ద విశేషమే కాదు, గొప్ప వింత కూడా! కూచిపూడిలో ఒక పక్క ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతూనే మరొక పక్క ఆ గ్రామాన్ని సిలికానాంద్ర కుటుంబం సుందరవనంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామంలో ఆరు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. గ్రామం అంతా ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. పాఠశాలల్లో అమెరికా తరహాలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

*** ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి.
సిలికానాంద్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖ తెలుగు వైద్యులు ఈ ఆస్పత్రికి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అన్ని జబ్బులకు ఈ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. తుఫాను పనుల ఒత్తిడిలో శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు దసరా పండగ రోజున ఈ ఆస్పత్రి ప్రారంభానికి తీరిక చేసుకుని తరలివచ్చారు. ప్రభుత్వం నుండి పదికోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం మంజూరు చేశారు. కూచిభొట్ల ఆనంద్ తదితర సిలికానాంద్ర కుటుంబ సభ్యుల సేవాభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆనంద్ వందేళ్ళ పాటు ప్రజల మధ్య ఉండి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ……కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.











సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రికి రూ.10కోట్లు ప్రకటించిన చంద్రబాబు

రూ.40కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని” వైద్యాలయాన్ని గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర వంటి సంస్థలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాల్లో ప్రవాసులు చొరవగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిలికానాంధ్ర సంస్థ సేవలను ఆయన అభినందించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10కోట్లను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియా నుండి పెద్ద సంఖ్యలో సిలికానంధ్ర సభ్యులు హాజరయ్యారు.


సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని” ప్రారంభించారు. చంద్రబాబు ప్రసంగిస్తూ రానున్న కాలంలో కూచిపూడి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి బృహత్తర వైద్యాలయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినందుకు సిలికానాంధ్ర సంస్థను దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్,మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టీవీ9 సీఈఓ రవిప్రకాష్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, సభ్యులు వేట శరత్, దీనబాబు కొండుభట్ల, అనూష కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

అట్లాంటాలో నవరస నట భామిని

అట్లాంటా హిందూ దేవాలయం అభివృద్ధి కోసం ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి చింతలపూడి జ్యోతి ఆద్వర్యంలో అక్టోబరు 7వ తేదీన నవరస నటభామిని పేరుతొ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. మిగిలిన వివరాలకు ఈ క్రింద బ్రోచర్ ను చూడవచ్చు.

సిలికానాంధ్ర సంజీవనికి మరో నాలుగు కోట్లు విరాళాలు.

విరాళాల సేకరణ కోసం కూచిపూడిలో ఆదివారం నిర్వహించిన సంజీవనిధామ్‌- 2 కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు 35లక్షలు అందించారు. కూచిపూడి చుట్టుపక్కల గల 150 గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాల్టీ ఆసుపత్రిని అక్టోబర్‌ 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాళాల సేకరణ కోసం నిర్వహించిన సంజీవనిధామ్‌-2 కార్యక్రమాన్ని హైదరాబాద్‌, అమెరికా, కూచిపూడి ప్రాంతాల్లో నిర్వహించగా రూ. 4.10 కోట్లు విరాళాలుగా వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కూచిపూడిలో ముందుగా గ్రామానికే చెందిన పామర్తి శివకుమార్‌ రూ. 56 వేలు సాయం చేశారు. తెదేపా మండల మాజీ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట్రావు, మొవ్వకు చెందిన మండవ సుగుణావతిలు రూ. 6 లక్షలు అందించగా గుత్తా హనుమంతరాలు(గూడపాడు) రూ. 5లక్షలు, లింగమనేని రామస్వామి (పెదపూడి) రూ. 3.03లక్షలు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన(పామర్రు), సూరపనేని రామకృష్ణ(పెడసనగల్లు), దండమూడి బలరామకృష్ణ(కూచిపూడి), సూరపనేని కృష్ణమోహన్‌లు రూ. 3 లక్షలు చొప్పున, కాశీభొట్ల నారాయణమూర్తి రూ. 1.50 లక్షలు, డాక్టర్‌ జి.సుదర్శనరావు(వీరంకిలాకు) రూ. లక్ష అందించారు. కార్యక్రమంలో జయహో కూచిపూడి సభ్యులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సిలికాన్ వ్యాలీలో సిలికానాంధ్ర 17వ వార్షికోత్సవం


కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో సిలికానాంధ్ర సంస్థ 17వ వార్షికోత్సవ సంబరాల్ని ఆదివారం నాడు ఘనంగా జరుపుకున్నారు. క్యూపర్టీనో నగరం డియాంజా కాలేజీలో జరిగిన ఈ వేడుకలకు సిలికానాంధ్ర కుటుంబం సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, దాతలు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంప్రదాయ కార్యక్రమాలతో తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలకు, విచ్చేసిన అతిధులకు తాటిపాముల మృత్యుంజయుడు ఆహ్వానం పలుకుతూ గత పదహారేళ్ళుగా సిలికానాంధ్ర జరిపిన ప్రయాణాన్ని, చేరుకొన్న మైలురాళ్ళను పునరావలోకనం చేసారు. దిలీప్ కొండిపర్తి, మాధవ కిడాంబి సారథ్యంలో ప్రదర్శించిన ‘హాస్యవల్లరి ‘లోని లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఆధునిక సాంకేతికాభివృద్ధి తెస్తున్న ఇబ్బందులు, అంతర్జాలంలో జరుగుతున్న పెళ్ళిచూపులు, వివిధ భాషాసంస్కృతుల మేళమైన హైద్రాబాదు నగర జీవిత చిత్రాల్ని ముఖ్యాంశాలుగా రచించిన ఈ నాటికలు సభను నవ్వులతో ముంచెత్తాయి. మాధవ కిడాంబి, రాంబాబు మంచికంటి, శాంతివర్ధన్ అయ్యగారి, లలిత అయ్యగారి, అనిమేష్ కొండిపర్తి, మూర్తి వేదుల, సతీష్ ముచ్చెర్ల సమర్థవంతంగా పాత్రలను పోషించారు. రాంపల్లి సదాశివ మిమిక్రీ, మాట్లాడేబొమ్మను ప్రదర్శించారు. ‘జానపద బ్రహ్మ ‘ మానాప్రగడ నరసిం హమూర్తి కుమారులు సాయి, శ్రీనివాస్ లు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరగా, ‘వికటకవి తెనాలి రామకృష్ణ ‘ నాటకం ప్రదర్శించబడింది. రావు తల్లాప్రగడ రచించగా, తెనాలి రామకృష్ణుని పాత్రలో ప్రముఖ నటుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ఒదిగిపోయారు. హాస్యచతురోక్తులతో, మధురంగా ఆలపించిన పద్యాలతో సభికులనుండి కరతాళ ధ్వనులను అందుకున్నారు. ఇతర పాత్రల్లో కూచిభొట్ల శాంతి, ఆర్చీశ్ ప్రఖ్య, శ్రీవేద శ్రీపాద, శ్రీదేవి అంగజాల, సూరజ్ దశిక, శ్రీనివాస శ్రీపాద, నారయణన్ రాజు, రావు తల్లాప్రగడ, సదాశివ్ రామపల్లి, శ్రీనివాస్ మంద్రప్రగడ, శర్మ యేడిద, వంశీ ప్రఖ్య, అభిరాం కల్లూరు నటించారు. హైస్కూల్ చదువుతున్న వరకూర్ ఈష మొదటిసారిగా కీబోర్దు సహకారాన్ని అందించింది. వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి అధ్యక్షోపన్యాసం చేస్తూ సిలికానాంధ్ర సాధించిన విజయాలను, రాబోయే సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాలను సభికులకు వివరించారు. సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత పదకొండు సంవత్సరాలలో 35000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న మనబడి అభివృద్ధిని వివరిన్స్తూ, ఈ కృషి వెనకాల ఉన్న కార్యకర్తలను, ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. 2018-19 సంవత్సరానికి మనబడి ప్రవేశాలు జరుగుతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్య కోశాధికారి కొండుభట్ల దీనబాబు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, మరియు సంగీత నృత్యాలకోసం ఏర్పాటు చేసిన ‘సంపద ‘ అకాడమీ కార్యక్రమ వివరాలను సభికులతో పంచుకొన్నారు. మహారాజపోషకుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ లక్కరెడ్డి హనిమిరెడ్డి చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న సంజీవని వైద్యశాల అందించబోయే సేవలను అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, దాతలను సత్కరించారు. ఈ వేదికపైననే శ్రీ విళంబి ఉగాది ఉత్సవంలో జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘ఎనుకుదురాట – అచ్చ తెలుగు అవధానం’ మాతా కోటేశ్వరరావు, మాతా శాంకరీ దేవి సంకలనం చేసిన పుస్తకం ఆవిష్కరించబడింది జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనిల్ అన్నం, సాయి కందుల, విజయసారధి, రవి చివుకుల, కిశోర్ గంధం, వంశీ నాదెళ్ళ, రత్నమాల వంక, స్నేహ వేదుల, వసంత మంగళంపల్లి, రాజశేఖర్ మంగళంపల్లి సహాయం అందజేసారు. అందమైన కార్యక్రమాలతో పాటు పసందైన పదహారణాల తెలుగు భోజనంతో కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది.



ప్రారంభోత్సవానికి ముస్తాభైన సిలికానాంద్ర సంజీవని


కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో, ఐదంతస్తులతో రూపుదిద్దుకున్న ‘సంజీవని’ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. వచ్చే విజయదశమి నాటికీ ఈ ఆసుపత్రిని ప్రారంభించాని రాత్రింబవళ్ళు సిలికానాంద్ర బృందంకష్టపడి పనిచేస్తున్నారు. సంజీవని ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న వివిధ ఆధునిక సౌకర్యాల గురించి సిలికానాంద్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కొన్ని చిత్రాలను విడుదల చేశారు. వాటిని తిలకించండి.







Siliconandhra sanjeevini ready to be inaugurated-tnilive international

సంజీవిని పది లక్షలు ఇచ్చిన కేసీపీ

కూచిపూడిలో నిర్మాణంలో ఉన్న సిలికానాంద్ర సంజీవని వైద్యశాలకు కేసీపీ యాజమాన్యం తరపున కేసీపీ సీఓఓ జీ.వెంకటేశ్వరరావు రూ.పది లక్షల ఆర్ధిక సాయం ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ ఈ ప్రాంత పేద ప్రజలకు వైద్యసేవలందించేలా దాతల సాయంతో ఏర్పాటు చేస్తున్న వైద్యశాల నిర్మాణానికి తమ చక్కర కర్మాగారం తరపున ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

సిలికానాంద్ర సంజీవినికి రూ.6లక్షల విరాళం

కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో నిర్మిస్తున్న సిలికానాంద్ర సంజీవని వైద్యశాలకు ఒక గది నిర్మాణానికి అవసరమైన రూ. ఆరు లక్షలను కూచిపూడి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అద్యక్షుడు డా.గొట్టిపాటి రామకృష్ణారావు వితరనగా బుధవారం అందించారు. ఆయన సతీమణి గొట్టిపాటి అమ్మాజీ జ్ఞాపకార్ధం సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ కు చెక్కు రూపంలో అందింకాహ్రు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి పిన్నమనేని భీమశంకరరావు, గొట్టిపాటి శ్రీనివాస్, పెద్దలు పాల్గొన్నారు.

సిలికానాంధ్ర మనబడికి నాటా పురస్కారం

గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి​ ​ఉత్తర అమెరికా తెలుగు సమితి (​నాటా​)​ ‘విద్యా ప్రదాయని’ పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా ​మెగా కన్వెన్షన్ వేదిక మీద​ నాటా​ అడ్వయిజరీ ​ ​కౌన్సిల్ ఛైర్మన్ ​ప్రేం కుమార్ రెడ్డి​​, ​ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ​తదుపరి ​అధ్యక్షులు​ ​రాఘవ రెడ్డి ​​తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు​ శరత్ వేట ​​ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ​ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు.​ తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను ​గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాల​కు పైగా​ అమెరికా, కెనడా​లతో పాటు 10 ​ఇతర ​దేశాలలో 35​,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష ​నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్‌సైట్‌ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ‘భాషాసేవయే భావితరాల సేవ’ అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి ​అహర్నిశలూ కృషి చేస్తుందని​ ​అన్నారు.

అమెరికాలో ముందడుగు వేస్తున్న “మనబడి”–TNI ప్రత్యేకం


అమెరికాలోని తెలుగువారు తమ పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్నారు. గుణింతాలు వల్లెవేయిస్తున్నారు. చూచిరాత రాయిస్తున్నారు. శతకాలు నేర్పుతున్నారు. 35 రాష్ట్రాలలో పదివేల మంది బాలలతో ‘మనబడి’ కళకళలాడుతోంది.

**అమెరికాలో ఉన్న మనవళ్ళకూ, మనవరాళ్ళకూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా ఎదురు చూసే తాతయ్యలకూ నానమ్మలకూ ఎంత నిరాశ. వాళ్ళకు మాత్రం పెద్దపెద్ద కోరికలెం ఉంటాయి? మనవడో మనవరాలో “చేతవెన్న ముద్దా…..” చెబితే వినాలని ఉంటుంది. “ముద్దుగారే యశోద….” పాట పాడితే మురిసిపోవాలని అనుకుంటుంది. గౌరవనీయులైన తాతగారికి అని సంబోధిస్తూ ఉత్తరం రాస్తే నలుగురికీ వినిపించాలని ఉంటుంది. పెద్దల దాకా ఎందుకు? తమ పిల్లలు కమ్మని తెలుగు మాట్లాడాలని గుండ్రని అక్షరాలూ రాయాలనీ కన్నవారికి మాత్రం ఉండదేమిటి? ఆలోటు తీర్చడానికే 2007 ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సిలికానాంధ్ర నేతృత్వంలో మనబడి ప్రారంభమైంది. సర్వజిత్ ఉగాది సుముహూర్తాన ఘనంగా అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయబద్దంగా అక్షరాలు దిద్దించాలంటే పలకా బలపాలు కావాలి. అమెరికాలో దొరుకుతాయా? అన్న సందేహం. ప్రయత్నిస్తే దొరక్కపోతాయా అన్న ఆశావాదం. అంగడి అంగడి తిరిగారు. అంజనమేసి గాలించారు. అనుకున్నది సాధించారు. ముహూర్తం సమయానికంతా పంచెకట్టులో నాన్నలోచ్చారు. పట్టుచీరలలో అమ్మలోచ్చారు. అ, ఆ, ఇ, ఈ కన్నవారు చేయిపట్టుకుని రాయిస్తుంటే…..పసివాళ్ళు బుద్దిగా దిద్దుకున్నారు. వందమంది పిల్లలతో కాలిఫోర్నియాలో ప్రారంభమైన తెలుగుబడి ముప్పై ఐదు రాష్ట్రాలకు నేటికి విస్తరించడానికి ఎంతో సమయం పట్టలేదు.

*** ఒప్పించి.. మెప్పించి
అసలే చదువుల ఒత్తిడి. దానికితోడు వారాంతపు బడా? అయినా అమెరికాలో ఉంటున్న పిల్లలకి తెలుగు అక్షరాలూ అవసరమా? అని వాధించినవారు ఉన్నారు. మనబడి వాళ్ళందర్నీ ఒప్పించింది. మెప్పించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సంఖ్య పదహారు కోట్లని అనుకుందాం. అందులో సగానికి సగం మంది ..రాష్ట్రం బయటో.. దేశం బయటో ఉన్నారు. వాళ్ళ వరకూ తెలుగు అర్ధం చేసుకోగలరు. మాట్లాడగలరు. రాయగలరు, చదవగలరు. సమస్యంతా రేపటి తరానికే ఓ పదేళ్ళ తర్వాతో పదిహేనేళ్ళ తర్వాతో ఆ పిల్లలు తెలుగు అర్ధం చేసుకోలేని , తెలుగు మాట్లాడలేని తెలుగు రాయలేని, తెలుగు చదవలేని తెలుగువారిగా మిగిలిపోతారు. భాషనే మర్చిపోయినపుడు మాతృ దేశం, మాతృ రాష్ట్రం మాత్రం ఏం గుర్తుంటాయి? అలా ఓ లంకె తెగిపోతుంది. మూలాలనేవీ సమూలంగా నాశనమైపోతాయి. అయినా అక్షరమంటే అక్షరమొక్కటే కాదు. అంతర్లీనతగా అందులో చరిత్ర ఉంది. సంస్కృతీ సంప్రదాయాలున్నాయి అక్షరాన్ని వదులుకుంటే అన్ని వదులుకున్నట్లే. అందుకే అంత ఆందోళన. అమ్మ ఒళ్ళోనో , అమ్మమ్మ పర్యవేక్షణలోనో ఉన్నంత కాలం పిల్లలు మాతృభాషే మాట్లాడతారు. బడికెళ్ళడం మొదలు పెట్టాక తల్లిభాష మెల్లమెల్లగా దూరమవుతుంది.

**ముప్పై ఐదు రాష్ట్రాలకు విస్తరణ
అమెరికాలోని ముప్పై ఐదు రాష్ట్రాల్లో మనబడి తెలుగు పాఠాలు నేర్పుతోంది. గత విద్యా సంవత్సరంలో 9200 మంది మనబడిలో విద్యనభ్యసించారు. 800మంది ఉపాధ్యాయులు అక్షర సేవలో నిమగ్నమయ్యారు. వీరు కాకుండా ఐదు వందల మంది సమన్వయకర్తలుగా ఉన్నారు. పరోక్షంగా మనబడి కోసం మరొక నాలుగు వందల మంది ప్రచార కర్తలుగా ఉన్నారు. మనబడి అంటే…మన బడే. ప్రతి విద్యార్ధి విధిగా తెలుగులో మాట్లాడాలి. మాట్లాడే ప్రయత్నమైనా చేయాలి. ఆరేళ్ళు నిండిన బాలబాలికలు పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. అక్షరమాలతో చదువు ప్రారంభం అవుతోంది. శనివారం లేదా ఆదివారం వారానికి ఒకరోజు బడి. అందరికి అనువైన ప్రాంతంలో పాఠశాల నిర్వహించుకుంటారు. పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, సంచులూ, టీషర్టులూ నిర్వాహకులే ఇస్తారు.

*** ప్రవేశం..ప్రసూనం..ప్రకాశం.. ప్రమోదం.. ప్రభాసం.. మొత్తం ఐదు తరగతులు
ఏడాదికో తరగతి. ఆగస్టు చివరి నాటికీ ప్రవేశ ప్రక్రీయ పూర్తవుతోంది. ప్రతి ఒక్కరూ ప్రవేశం నుంచే చదవాలని లేదు. ప్రాధమిక అవగాహనా ఉన్నవారిని నైపుణ్యాన్ని బట్టి ఏ ప్రసూనం లోనో చేర్చుకునే అవకాశమూ ఉంది. క్రమశిక్షణ విషయంలో కచ్చితంగా ఉంటారు. తొంబై శాతం హాజరు తప్పనిసరి. అంతకు తగ్గితే పరీక్షలకు అనుమతించరు. ఏటా స్నాతకోత్సవం ఘనంగా జరుగుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధ్రువపత్రాల్ని జారీ చేస్తుంది. బోధన ప్రణాళిక ఎంత పక్కాగా ఉంటుందంటే ..బదిలీ మీదో పదోన్నతి మీదో అమెరికాలోని మరో నగరానికి వెళ్ళినా……స్థానికంగా ఉన్న మనబడిలో చేరిపోవచ్చు. పాఠాలు కోల్పోయే ప్రసక్తే లేదు. వార్షిక రుసుము మూడు వందల డాలర్లు. ఫీజుల్లో చాలా వరకు పాఠశాల భవనం అద్దెలకే వెళ్ళిపోతుంది. అక్కడి చట్టాల ప్రకారం పాఠశాల ఆవరణ బీమా తప్పనిసరి అందుకూ కొంత చెల్లించాలి. భారత్ లో పుస్తకాలు ముద్రించి, అమెరికాకు తరలించడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన విషయం ఖర్చులతో పోలిస్తే ఆ మొత్తం నామమాత్రమే.

**ప్రత్యేక పాఠ్య ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ లో పుట్టి, తెలుగు వాతావరణంలో పెరుగుతూ తెలుగు నేర్చుకోవడం వేరు. మనదికాని దేశంలో, మనది కాని మాధ్యమంలో చదువుకుంటూ, మనది కాని వాతావరణంలో జీవిస్తూ తెలుగు నేర్చుకోవడం వేరు. ప్రాంతాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక మారుతుంది. మారాలి కూడా. మనబడి ప్రణాళికా బృందం సభ్యులు తిరుమల పెద్దింటి శ్రీనివాస్, కూచిభొట్ల శాంతి, తూములూరు శంకర్, గుండుమల్ల మాణిక్యవల్లి, వసంత మంగళంపల్లి, ఓరుగంటి గోపాలకృష్ణ, రాయవరం భాస్కర్.. అమెరికాలో ఉంటున్న తెలుగు పిల్లల్ని దృష్టిలో ఉంచుకునే పాటాలు రాశారు. ఈ ప్రయత్నంలో తెలుగు విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సహకరిస్తున్నాయి.

**ఇప్పటి వరకు 35వేల మందికి బోధన
మనబడి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 35 వేల మంది విద్యార్ధులకు తెలుగు భాషలో శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎనిమిది వేల మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టాలను(పాస్ సర్టిఫికెట్స్) ఇప్పించారు. ప్రతి ఏటా అమెరికాలోని ప్రధాన నగరాల్లో స్నాతకోత్సవాలు అట్టహాసంగా నిర్వహించి విద్యార్ధులకు పట్టాలను ప్రధానం చేస్తున్నారు.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ ప్రతి ఏటా ఈ పట్టాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.

**WASC గుర్తింపు
అమెరికాలో మంచి విద్యా ప్రమాణాలు పాటించే సంస్థలకు ఆదేశంలో వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) సంస్థ గుర్తింపు ఇస్తుంది. మనబడికి ఈ సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా భావిస్తున్నారు. దీనితో పాటు అమెరికాలోని 28 స్కూల్ జిల్లాల్లో మనబడిని గుర్తించారు. ఇక్కడ ద్వీతీయ భాషగా తెలుగు నేర్చుకున్న విద్యార్ధులను పై తరగతుల్లో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రస్తుతం పన్నెండు దేశాలకు విస్తరించింది. చాలా దేశాల్లో ఉన్న తెలుగు వారి నుండి మనబడి శాఖను ప్రారంభించమని విజ్ఞప్తులు అందుతున్నాయి.

**పటిష్టవంతమైన యంత్రాంగం
సిలికానాంద్ర చేపట్టిన ప్రతి ప్రాజెక్టు దిగ్విజయం కావడానికి ఆ సంస్థలో ఉన్న సభ్యుల చిత్తశుద్దే కారణం తమ నాయకుడు కూచిభొట్ల ఆనంద్ కలలు కన్న ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ఆ సంస్థ సభ్యుల అంకితభావానికి నిదర్శనం. ఈ సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు ‘సిలికానాంద్ర’ను తన కుటుంబం లాగా భావిస్తూ శని, ఆదివారాల్లో పూర్తీ సమయాన్ని, మిగిలిన రోజుల్లో సాయంత్రం సమయాలు కేటాయిస్తున్నారు.

**పటిష్టమైన పాలనా వ్యవస్థ
మనబడి కులపతిగా రాజు చామర్తి వ్యవహరిస్తున్నారు. మనబడి వ్యవస్థను నడిపించడం కోసం ఆర్ధిక, సాంకేతిక వ్యవహారాలను కొండుభట్ల దీనబాబు చక్కబెడుతున్నారు. ఎప్పటికప్పుడు నూతన పాట్యంశాలను రూపొందించడంలో కూచిభొట్ల శాంతి ఆద్వర్యంలోని బృందం చురుకైన పాత్ర పోషిస్తుంది. కొండిపర్తి దిలీప్, వేట శరత్, రాయవరం భాస్కర్, డాన్జీ తోటపల్లి తదితరులు మనబడి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది 11,000 మంది విద్యార్ధులను మనబడిలో చేర్పించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిచినట్లు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. అమెరికాలోని మరికొన్ని రాష్టాల్లో ఇంకా కొన్ని దేశాల్లో మనబడి శాఖలను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు ఆనంద్ తెలిపారు.

**విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రేరణ
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకే పరిమితమై ఒకప్పుడు ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించింది. మనబడి ప్రేరణతో సిలికానాంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 నాటికి ఈ విశ్వవిద్యాలయం పూర్తీ స్థాయిలో పని చేయడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. సొంత గడ్డపై మాతృభాషను మరచిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం నలుమూలలకు తెలుగు భాష తీయదనాన్ని విస్తరింపజేసిన సిలికానాంధ్ర భాషా సైన్యానికి ‘ప్రతి ఒక్క తెలుగువాడు చెయ్యెత్తి జై కొడుతున్నాడు’. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.




























అమెరికాలో ముందడుగు వేస్తున్న ‘మనబడి’


అమెరికాలోని తెలుగువారు తమ పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్నారు. గుణింతాలు వల్లెవేయిస్తున్నారు. చూచిరాత రాయిస్తున్నారు. శతకాలు నేర్పుతున్నారు. 35 రాష్ట్రాలలో పదివేల మంది బాలలతో ‘మనబడి’ కళకళలాడుతోంది.
**అమెరికాలో ఉన్న మనవళ్ళకూ మనవరాళ్ళకూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా ఎదురు చూసే తాతయ్యలకూ నానమ్మలకూ ఎంత నిరాశ వాళ్ళకు మాత్రం పెద్దపెద్ద కోరికలెం ఉంటాయి? మనవడో మనవరాలో చేతవెన్న ముద్దా.. చెబితే వినాలని ఉంటుంది, ముద్దుగారే యశోద పాడితే మురిసిపోవాలని అనుకుంటుంది. గౌరవనీయ్లైన తాతగారికి అని సంభోదిస్తూ ఉత్తరం రాస్తే నలుగురికీ వినిపించాలని ఉంటుంది. పెద్దల దాకా ఎందుకు? తమ పిల్లలు కమ్మని తెలుగు మాట్లాడాలని గుండ్రని అక్షరాలూ రాయాలనీ కన్నవారికి మాత్రం ఉండదేమిటి? ఆలోటు తీర్చడానికే 2007 ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సిలికానాంద్ర నేతృత్వంలో మనబడి ప్రారంభమైంది. సర్వజిత్ ఉగాది సుముహూర్తాన ఘనంగా అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా అక్షరాలు దిద్దించాలంటే పలకా బలపాలు కావాలి. అమెరికాలో దొరుకుతాయా? అన్న సందేహం. ప్రయత్నిస్తే దొరక్కపోతయా. అన్న ఆశావాదం. అంగడి అంగడి తిరిగారు. అంజనమేసి గాలించారు. అనుకున్నది సాధించారు. ముహూర్తం సమయానికంతా పంచేకట్టులో నన్నలోచారు. పట్టుచీరలో అమ్మలోచ్చారు. అ, ఆ, ఇ, ఈ కన్నవారు చేయిపట్టుకుని రాయిస్తుంటే.. పసివాళ్ళు బుద్దిగా దిద్దుకున్నారు. వందమంది పిల్లలతో కాలిఫోర్నియాలో ప్రారంభమైన తెలుగుబడి ముప్పై ఐదు రాష్ట్రాలకు నేటికీ విస్తరించడానికి ఎంతో సమయం పట్టలేదు.


**భాష..బాస
అసలే చదువుల ఒత్తిడి. దానికితోడు వారాంతపు బడా? అయినా అమెరికాలో ఉంటున్న పిల్లలకి తెలుగు అక్షరాలూ అవసరమా? అని వాధించినవారు ఉన్నారు. మనబడి వాళ్ళందర్నీ ఒప్పించింది. మెప్పించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సంఖ్యా పదహారు కోట్లని అనుకుందాం. అందులో సగానికి సగం మంది ..రాష్ట్రం బయటో.. దేశం బాయ్తో ఉన్నారు. వాళ్ళ వరకూ తెలుగు అర్ధం చేసుకోగలరు. మాట్లాడగలరు. రాయగలరు, చదవగలరు. సమస్యంతా రేపటి తరానికే ఓ పదేళ్ళ తర్వాతో పదిహేనేళ్ళ తర్వాతో ఆ పిల్లలు తెలుగు అర్ధం చేసుకోలేని , తెలుగు మాట్లాడలేని తెలుగు రాయలేని, తెలుగు చదవలేని తెలుగువారిగా మిగిలిపోతారు. భాషనే మాతృ రాష్ట్రం మాత్రం ఏం గుర్తుంటాయి? అలా ఓ లంకె తెగిపోతుంది. మూలాలనేవీ సమూలంగా నాశనమైపోతాయి. అయినా అక్షరమంటే అక్షరమొక్కటే కాదు. అంతర్లీనతగా అందులో చరిత్ర ఉంది. సంస్కృతీ సంప్రదాయాలున్నాయి అక్షరాన్ని వదులుకుంటే అన్ని వదులుకున్నట్లే. అందుకే అంత ఆందోళన. అమ్మ ఒళ్ళోనో , అమ్మమ్మ పర్యవేక్షణలోనో ఉన్నంత కాలం పిల్లలు మాతృభాషే మాట్లాడతారు. బడికేల్లడం మొదలు పెట్టాక తల్లిబాష మెల్లమెల్లగా దూరమవుతుంది.


**ముప్పై ఐదు విస్తరణ
అమెరికాలోని ముప్పై ఐదు రాష్ట్రాల్లో మనబడి తెలుగు పాటాలు నేర్పుతోంది. గత విద్యా సంవత్సరంలో తొమ్మిదివేల రెండు వందల మంది ఎనిమిది వందల మంది ఉపాద్యాయులు అక్షర సేవలో నిమగ్నమయ్యారు. వీరు కాకుండా ఐదు వందల మంది సమన్వయ కర్తలుగా ఉన్నారు. పరోక్షంగా మనబడి కోసం మరొక నాలుగు వందల మంది ప్రచార కర్తలుగా ఉన్నారు. మనబడి అంటే, మన బడే. ప్రతి విద్యార్ధి విధిగా తెలుగులో మాట్లాడాలి. మాట్లాడే ప్రయత్నమైనా చేయాలి. ఆరేళ్ళు నిండిన బాలబాలికలు పాటశాలలో ప్రవేశానికి అర్హులు. అక్షరమాలతో చదువు ప్రారంభం అవుతోంది. శనివారం లేదా ఆదివారం వారానికి ఒకరోజు బడి. అందరికి అనువైన ప్రాంతంలో పాటశాల నిర్వహించుకుంటారు. పాట్య పుస్తకాలు, నోటు పుస్తకాలు సంచులూ టీ షర్టులూ నిర్వాహకులే ఇస్తారు.
**ప్రవేశం..ప్రసూనం..ప్రకాశం.. ప్రమోదం.. ప్రభాసం.. మొత్తం ఐదు తరగతులు ఏడాదికో తరగతి ఆగస్టు చివరి నాటికీ ప్రవేశ ప్రక్రీయ పూర్తవుతోంది. ప్రతి ఒక్కరూ ప్రవేశం నుంచే చదవాలని లేదు. ప్రాధమిక అవగాహనా ఉన్నవారిని నైపుణ్యాన్ని బట్టి ఏ ప్రసూనం లోనో చేర్చుకునే అవకాశమూ ఉంది. క్రమశిక్షణ విషయంలో కచ్చితంగా ఉంటారు. తొంబై చాటం హాజరు తప్పనిసరి. అంతకు తగ్గితే పరీక్షలకు అనుమతించరు. ఏటా స్నాతకోత్సవం ఘనంగా జరుగుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధ్రువ పత్రాల్ని జారీ చేస్తుంది. బోధన ప్రణాళిక ఎంత పక్కాగా ఉంటుందనే ..బదిలీ మీదో పదోన్నతి మీదో అమెరికాలోని మరో నగరానికి వెళ్ళినా ..స్థానికంగా ఉన్న మనబడిలో చేరిపోవచ్చు. పాటాలు కోల్పోయే ప్రసక్తే లేదు. వార్షిక రుసుము మూడు వందల డాలర్లు. ఫీజుల్లో చాలా వరకు పాటశాల భవనం అద్దెలకే వెళ్ళిపోతుంది. అక్కడి చట్టాల ప్రకారం పాటశాల ఆవరణ బీమా తప్పనిసరి అందుకూ కొంత చెల్లించాలి. భారత్ లో పుస్తకాలు ముద్రించి, అమెరికాకు తరలించడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన విషయం ఖర్చులతో పోలిస్తే ఆ మొత్తం నామమాత్రమే.


**ప్రత్యెక సిలబస్
ఆంధ్రప్రదేశ్ లో పుట్టి, తెలుగు వాతావరణంలో పెరుగుతూ తెలుగు నేర్చుకోవడం వేరు. మనదికాని దేశంలో, మనది కాని మాధ్యమంలో చదువుకుంటూ, మనది కాని వాతావరణంలో జీవిస్తూ తెలుగు నేర్చుకోవడం వేరు. ప్రాంతాన్ని బట్టి పాట్య ప్రణాళిక మారుతుంది. మారాలి కూడా. మనబడి ప్రణాళికా బృందం సభ్యులు తిరుమల పెద్దింటి శ్రీనివాస్, కూచిభొట్ల శాంతి, తూములూరు శంకర్, గుండుమల్ల మాణిక్యవల్లి, వసంత మంగళంపల్లి, ఓరుగంటి గోపాలకృష్ణ, రాయవరం భాస్కర్.. అమెరికాలో ఉంటున్న తెలుగు పిల్లల్ని దృష్టిలో ఉంచుకునే పాటాలు రాశారు. ఈ ప్రయత్నంలో తెలుగు విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సహకరిస్తున్నాయి.


**ఇప్పటి వరకు 35వేల మందికి బోధన
మనబడి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 35 వేల మంది విద్యార్ధులకు తెలుగు భాషలో శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎనిమిది వేల మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టాలను(పాస్ సర్టిఫికెట్స్) ఇప్పించారు. ప్రతి ఏటా అమెరికాలోని ప్రధాన నగరాల్లో నాటకోత్సవాలు అట్టహాసంగా నిర్వహించి విద్యార్ధులను పట్టాలకు ప్రధానం చేస్తున్నారు.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ ప్రతి ఏటా ఈ పట్టాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.


**WASC గుర్తింపు
అమెరికాలో మంచి విద్యా ప్రమాణాలు పాటించే సంస్థలకు ఆదేశంలో వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) సంస్థ గుర్తింపు ఇస్తుంది. మనబడికి ఈ సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా భావిస్తున్నారు. దీనితో పాటు అమెరికాలోని 28స్కూల్ జిల్లాలో మనబడిని గుర్తించారు. ఇక్కడ ద్వీతీయ భాషగా తెలుగు నేర్చుకున్న విద్యార్ధులను పై తరగతుల్లో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రస్తుతం పన్నెండు దేశాలకు విస్తరించింది. చాలా దేశాల్లో ఉన్న తెలుగు వారి నుండి మనబడి శాఖను ప్రారంభించమని విజ్ఞప్తులు అందుతున్నాయి.


**పటిష్టవంతమైన యంత్రాంగం
సిలికానాంద్ర చేపట్టిన ప్రతి ప్రాజెక్టు దిగ్విజయం కావడానికి ఆ సంస్థలో ఉన్న సభ్యుల చిత్తశుద్దె కారణం తమ నాయకుడు కూచిభొట్ల ఆనంద్ కలలు కన్న ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ఆ సంస్థ సభ్యుల అంకితభావానికి నిదర్శనం. ఈ సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు సిలికానాంద్రను తన కుటుంబం లాగా భావిస్తూ శని, ఆదివారాల్లో పూర్తీ సమయాన్ని, మిగిలిన రోజుల్లో సాయంత్రం సమయాలు కేటాయిస్తారు.
**మనబడి డీన్ గా రాజు చామర్తి వ్యవహరిస్తున్నారు. మనబడి వ్యవస్థను నడిపించడం కోసం ఆర్ధిక, సాంకేతిక వ్యవహారాలను కొండుభట్ల దీనబాబు చక్కబెడుతున్నారు. ఎప్పటికప్పుడు నూతన పాట్యంశాలను రూపొందించడంలో కూచిభొట్ల శాంతి ఆద్వర్యంలోని బృందం చురుకైన పాత్ర పోషిస్తుంది. కొండిపర్తి దిలీప్, వేట శరత్, రాయవరం భాస్కర్, డాన్జీ తోటపల్లి తదితరులు మనబడి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది 11,000 మంది విద్యార్ధులను మనబడిలో చేర్పించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిచినట్లు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. అమెరికాలోని మరికొన్ని రాష్టాల్లో ఇంకా కొన్ని దేశాల్లో మనబడి శాఖలను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు ఆనంద్ తెలిపారు.


**విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రేరణ
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకే పరిమితమై ఒకప్పుడు ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించింది. మనబడి ప్రేరణతో సిలికానాంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 నాటికి ఈ విశ్వవిద్యాలయం పూర్తీ స్థాయిలో పని చేయడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. సొంత గడ్డపై మాతృభాషను మరచిపోతున్నప్రస్తుత తరుణంలో ప్రపంచం నలుమూలలకు తెలుగు భాష తీయదనాన్ని విస్తరింపజేసిన సిలికానాంద్ర భాషా సైన్యానికి ‘ప్రతి ఒక్క తెలుగువాడు చెయ్యెత్తి జై కొడుతున్నాడు’. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్
siliconandhra manabadi













కూచిపూడిలో కూచిభొట్ల ఆనంద్ జన్మదిన వేడుకలు


భారతీయ సమాజాన్ని అమెరికాలో నిర్మిస్తున్న వ్యక్తి కూచిభొట్ల ఆనంద్‌ అని ఆంధ్రప్రదేశ్‌ భాషా, సాంస్కృతికశాఖ సంచాలకుడు డి.విజయభాస్కర్‌ పేర్కొన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని వైద్యశాల భవన మొదటి శ్లాబు వేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయభాస్కర్‌ మాట్లాడుతూ సంస్కృతిని మరువకుండా ఉండేలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భారతీయులకు సొంత సంస్కృతిని అందించేలా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కూచిపూడి నాట్యారామం వేరు, సిలికానాంధ్ర నెలకొల్పుతున్న సంజీవని వైద్యశాల వేరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంజీవని వైద్యశాల ఈ ప్రాంత ప్రజలకు ఆశాకిరణమన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌, ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ శాఖ ఐజీ పి.వెంకట్రామిరెడ్డి, వేదపండితుడు విష్ణుభట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనంద్‌ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అంతకు ముందు కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి నాట్యకళాపీఠం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి నాట్టువాంగంలో నాట్యాచార్యులు డాక్టర్‌ వేదాంతం రాధేశ్యామ్‌, డాక్టర్‌ వేదాంతం వెంకటదుర్గాభవాని గాత్రసహకారంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాట్యగురువులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.



విజయవాడ నర్తకికి యునెస్కో ఆహ్వానం


విజయవాడకు చెందిన ప్రముఖ కూచిపూడి నర్తకీమణి అచ్యుత మానసకు యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కౌన్సిల్‌ నుంచి ఆహ్వానం అందింది. దీనిలోభాగంగా ఈ నెల 4 నుంచి 8 వరకు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరుగనున్న 51వ అంతర్జాతీయ నృత్య సమ్మేళనంలో ఆమె ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మంది శాస్త్రీయ నృత్య కళాకారులు హాజరుకానున్న ఈ వేడుకల్లో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి ఆహ్వానం అందుకున్న తొలి తెలుగు అమ్మాయి(తెలుగు రాష్ట్రాల్లో) మానస కావడం విశేషం. నృత్యప్రదర్శనతో పాటు కూచిపూడి నృత్య విశేషాలతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శన, ‘కూచిపూడి నృత్యంలో తరంగం’ అంశంపై కార్యశాల కూడా ఆమె నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఏథెన్స్‌ ప్రదర్శనలో తరంగం అంశంతో పాటు ‘వందేమాతరం’ అంశాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

మరో రికార్డు సృష్టించిన “కూచిపూడి” ఆనంద్-12కోట్ల భారీ విరాళాల సేకరణ–TNI ప్రత్యేకం


సిలికానాంధ్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ఇంటిపేరు మారిపోయింది. ఆయన్ని అందరు కూచిపూడి ఆనంద్ గానే పిలుస్తున్నారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరించాలని పంచె బిగించిన ఆనంద్ నేడు ఆ నాట్యం పుట్టినిల్లైన కూచిపూడి గ్రామం రూపురేఖలనే మార్చి వేశారు. ప్రస్తుతం కూచిపూడి గ్రామ ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తుంది. గతంలో ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి గిన్నిస్ రికార్లులు బద్దలు కొట్టిన కూచిభొట్ల ఆనంద్ మరో అద్భుతమైన రికార్డును నెలకొల్పారు.
**భిన్నదృవాలు ఏకమయ్యాయి..చరిత్ర సృష్టిస్తున్నాయి.
కూచిభొట్ల ఆనంద్ కు, టీవీ9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ కు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఈ రెండు భిన్న దృవాలు, వృత్తులు వేరు, కులం వేరు. ఈ ఇరువురు వ్యక్తులు కలుస్తాయని అద్భుతాలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. వాస్తవానికి టీవీ9 రవి ప్రకాష్ కు అమెరికాలో చాలా సంవత్సరాల నుండి ప్రముఖ తెలుగు సంఘాలతో, వాటి నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగు సంఘాల ఉత్సవాలకు ఆయన తరచుగా హాజరై కీలక ప్రసంగాలు చేసేవారు. అయినప్పటికీ పెద్దగా తెలుగు సంఘాలు ఏమీ ఆయనను ఆకర్షించలేదు. అమెరికాలో చిన్న తెలుగు సంస్థగా ప్రారంభమైన సిలికానాంద్ర నిర్వహిస్తున్న కార్యక్రమాలు రవిప్రకాష్ ను ఆకట్టుకున్నాయి. కూచిభొట్ల ఆనంద్ లో ఉన్న అసాధారణ ప్రతిభను రవిప్రకాష్ గుర్తించారు. టీవీ9లో తెలుగు భాషకు సంబంధించి ప్రత్యెక కార్యక్రమం నిర్వహించే విధంగా ఆనంద్ ను ప్రోత్సహించారు. సిలికానాంద్ర చేపడుతున్న భారీ కార్యక్రమాలకు రవిప్రకాష్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరిస్తూ వచ్చారు. ఒకరకంగా ఆనంద్ చేస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు రవిప్రకాష్ బాగా ఆకర్షితులయ్యాడు.

**కూచిపూడి ఆసుపత్రికి వరదలా వచ్చిపడుతున్న విరాళాలు
కూచిపూడి గ్రామంలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మిస్తున్న సంజీవని ఆసుపత్రికి ప్రస్తుతం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న గ్రామంలో 200 పడకల ఆధునిక వైద్యశాల ఏర్పాటు చేయాలని ఆనంద్ నడుం బిగించారు. మొదట్లో ఇంత చిన్న గ్రామంలో ఇంత భారీ ఆసుపత్రి అవసరమా అని చాలా మంది పెదవి విరిచారు. కానీ పట్టుదలతో ఆనంద్ చేసిన కృషి నేడు ఫలించింది. టీవీ9 రవిప్రకాష్ ఆనంద్ భుజం తట్టి ప్రోత్సహించారు. స్వయంగా నాలుగుకోట్ల విరాళాన్ని అందించారు. టీవీ9 సంస్థ ద్వారా సంజీవని ఆసుపత్రికి విరాళాల సేకరణ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన మూడు గంటల ప్రత్యేక విరాళాల సేకరణ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. పది కోట్ల విరాళాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా వారి అంచనాలను అధిగమించి పన్నెండు కోట్లకు పైగా విరాళాలు అందాయి. సమాజంలో ఉన్న సామాన్య వర్గాలు కూడా విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రిక్షా కార్మికులు, షాపులలో పని చేసే గుమ్మస్తాలు, వృద్దులు ఉపాద్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి భారీ విరాళాలు అందించారు. కూచిపూడి గ్రామంలో ఆదివారం జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు క్యూలో నిలబడి విరాళాలు అందించారు. ఇదొక అద్భుతం.

**తెలుగు సంఘాలకు ఇది ఒక ఆదర్శం!
అమెరికాలో తెలుగు సంఘాలు నలభై ఏళ్లకు పూర్వమే ఆవిర్భవించాయి. పెద్ద ఎత్తున ఉత్సవాలు, చిన్నపాటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పైనే ఈ తెలుగు సంఘాలు ఇప్పటి వరకు దృష్టి పెడుతూ వచ్చాయి. ఒక పెద్ద ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సిలికాన్ వ్యాలిలో ఏర్పడిన చిన్న తెలుగు సంస్థ సిలికానాంద్ర అద్భుతాలనే సృష్టిస్తుంది. చాలా గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. సొంతగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు అమెరికాలోనూ సిలికానాంద్ర చేస్తున్న కార్యక్రమాలను మిగిలిన తెలుగు సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలి. వర్గ, కుల, రాజకీయ విభేదాలు విస్మరించి ప్రతి తెలుగు సంఘం సామాజిక సేవా కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సిలికానాంద్రను కుచిభోట్ల ఆనంద్ స్థాపించినప్పటికీ అందులో ఉన్న సభ్యులందరూ ఆనంద్ కన్నా ఎక్కువగానే శ్రమిస్తూ ఉంటారు. దీని మూలంగానే ఆ సంస్థ చేపట్టిన అన్ని కార్యక్రమాలు జయప్రదం అవుతున్నాయి. మిగిలిన తెలుగు సంఘాలు కూడా దీనిని గమనించాలి. -కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.




ఆదివారం సంజీవని ఆసుపత్రికి విరాళాల సేకరణ


కూచిపూడి గ్రామంతో పాటు దాని పరిసర గ్రామ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్యంతో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సంజీవని ఆసుపత్రి నిర్మాణానికి ఆదివారం నాడు టీవీ9 వేదికగా విరాళాలను సేకరించనున్నట్లు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ₹10కోట్ల లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సహృదయులు అందరూ ఈ ఆసుపత్రి నిర్మాణానికి విరివిగా నిధులు అందించవల్సిందిగా కోరారు.

సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలకు రూ.కోటి విరాళం

కృష్ణా జిల్లా కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి నిర్మాణానికి కావూరి చలపతిరావు(చినముత్తేవి) కుటుంబీకులు శనివారం రూ.కోటి విరాళాన్ని అందించారు. ఆయన జ్ఞాపకార్థం కుమారుడు కావూరి సుబ్బరామయ్య, విజయ దంపతులు, మరో కుమారుడు సూర్యప్రకాశరావు, తల్లి హైమావతి చేతుల మీదుగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌కు చెక్కును అందించారు.స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ అధ్యక్షుడు సీఎల్‌ వెంకట్రావు, డా. వడ్లమాని రవి తదితరులు పాల్గొన్నారు.