కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సంజీవని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి అమెరికాతో పాటు వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. మంగళవారం విరాళాలు దినోత్సవంగా పాటించి విరాళాలు ఇవ్వాలని సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఇచ్చిన పిలుపుకు 69వేల డాలర్లు విరాళంగా అందాయి. 549 మంది దాతల నుండి ఈ అందినట్లు ఆనంద్ ప్రకటించారు. విరాళాలు అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
