గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు పాతూరి నాగభూషణం కుమార్తె డా.బిందుప్రియ వివాహం మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ సెంటరులో శనివారం రాత్రి వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల, అమెరికాలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఈ పెళ్లిసందడికి హాజరయ్యారు.
