అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 4 నుంచి 3 రోజుల పాటు తానా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. తానా వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు చెప్పారు. తెదేపా ఘన విజయం సాధించి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే నమ్మకంతో ఆహ్వాన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
