నిప్పు-నిజాయితీ

‘‘తప్పు చేసినవాళ్లు మాత్రమే భయపడతారు. నేనెప్పుడూ నిజాయతీగా ఉండడానికి ప్రయత్నిస్తా. అందుకే నాకు భయపడడం చేతకాదు’’ అంటోంది కాజల్‌. ప్రసుత్తం తేజ దర్శకత్వం వహిస్తున్న ‘సీత’లో నటిస్తోందామె. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఎదుటివాళ్లని గౌరవిస్తాను. వాళ్ల మాటల్ని వింటాను. కానీ నా మనసులో ఏముందో అదే మాట్లాడతాను. పరిశ్రమలో ఎక్కువకాలం అణిగిమణిగి ఉండలేం. అప్పుడప్పుడూ కాస్త దురుసుగా ఉండాలి. లేదంటే మనల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. నేనెప్పుడూ చెప్పుడు మాటల్ని వినను. అలాంటివి ప్రోత్సహించను. నాకెప్పుడూ అమ్మా, నాన్న, చెల్లాయి రూపంలో నాకో రక్షణ కవచం ఉంది. దాన్ని దాటుకుని ఎవరూ రాలేరు. వాళ్లుంటే నాకుండే ధీమానే వేరు’’ అని చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)