మరో 40 మల్టిప్లెక్స్‌లు-వాణిజ్య-03/29

* మిరాజ్ సినిమాస్ రాబోయే15 నెలల్లో తెలంగాణలో మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 4 స్క్రీన్లుండగా, విస్తరణలో భాగంగా మరో 36 స్క్రీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలలో కూడా మల్టీప్లెక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో స్క్రీన్ల పెంపుకు దాదాపు రూ.80 కోట్ల దాకా ఖర్చుచేయనున్నట్లు మిరాజ్ సినిమాస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెండిరట్ట చెప్పారు.
*ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే రెండు రకాల గృహ రుణ ఉత్పతుల్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది
* వాబ్‌కో ఇండియా షేర్లు దాదాపు 8శాతం పెరిగాయి. దీని మాతృసంస్థ వెబ్‌కో హోల్డింగ్స్‌ జెడ్‌ఎఫ్‌ ఫ్రైరిచెష్ఫన్‌ ఏజీతో ఒప్పందానికి రావడంతో షేర్లు ర్యాలీ చేశాయి. జెడ్‌ఎఫ్‌ సంస్థ దాదాపు 136 మిలియన్‌ డాలర్లు విలువైన షేర్లను నగదు చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ విలువను దాదాపు 7బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. దీంతో వాబ్‌కో ఉదయం 10.45 సమయంలో 7.69శాతం పెరిగి రూ.6,852 వద్దకు చేరాయి.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వచ్చే నెల 1 నుంచి వాహన ధరల్ని పెంచబోతున్నట్లు ప్రకటించింది.
*కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రా బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో 114,56,72,061 ఈక్విటీ షేర్లు కేటాయించింది. ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ కల షేర్‌ను రూ.18.42 ప్రీమియంతో కలిపి రూ.28.42 ధరకు ఈ షేర్లు జారీ చేసింది.
*ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న నవయుగ కంటెయినర్‌ టెర్మినల్‌ (ఎన్‌సీటీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టీఈయూ (ట్వంటీ-ఫుట్‌ ఈక్వలెంట్‌ యూనిట్‌) సరకు నిర్వహణతో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.
*వైద్య సేవల రంగంలో సేవలనందిస్తోన్న కాల్‌హెల్త్‌ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపింది.
*ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంకుకు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్టేటర్‌లో 75 శాతం వాటాను ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేయనుంది.
*పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంకులకు ప్రభుత్వం రూ.21,428 కోట్ల మూలధనం అందించబోతోంది.
*ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడుల రూపంలో 2018లో భారత్‌లోకి 20.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) వచ్చాయని ఓ నివేదిక చెబుతోంది.
*రూరల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లో మెజార్టీ వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి కొనుగోలు ప్రక్రియను గురువారం పూర్తి చేసింది.
* మారుతీ సుజుకీ తమ మధ్య స్థాయి సెడాన్‌ కారు సియాజ్‌ను సరికొత్త ఇంజిన్‌తో విపణిలోకి విడుదల చేసింది. న్యూ అల్యూమినియం 1.5 లీటర్‌ డీడీఐఎస్‌ 225 డీజిల్‌ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, మెరుగుపరిచిన సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించింది.
*జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.59.2 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) నిర్ణయించింది.
*పెన్నా గ్రూపు, రస్‌ ఆల్‌ ఖైమాల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి గురువారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
*అపాచీ ఆర్‌టీఆర్‌ శ్రేణి అన్ని బైక్‌లను యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో ఆధునికీకరించినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది.
*అయిదు నెలల వ్యవధిలోనే రెండు ఘోర దుర్ఘటనలకు కారణమైన 737 మ్యాక్స్‌ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను నవీకరిస్తుస్తామని, ఫలితంగా విమాన నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఉండబోవని తయారీ సంస్థ బోయింగ్‌ ప్రకటించింది.
*శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) తాజాగా రెండు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)