నల్లమచ్చల అరటిపండు తినవచ్చు

ఎంత మాత్రం అలా చేయకండీ ఎందుకంటే వాటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవి శరీరానికి అత్యంత లబాదయకమని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆడ హ్యూమన్ ఎకాలజీ వారు చెబుతున్నారు. మార్కెట్ కి వెళ్లి పసుపు పచ్చగా ఉండి ఒక్క మచ్చ కూడా లేని అరటి పండులు కొనుక్కోను వస్తాము. ఒక రోజు బాగానే ఉంటాయి అవిమాత్రం తింటారు. మచ్చలేమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి మరీ తింటారు. కనీ మచ్చలు వచ్చి బాగా పండిన అరటి పండులో బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇందులో పోటాషీయం , మాంగనీసు, ఫిబార్, రాగి, విటమిన్ –సి, విటమిన్ బీ6 మరియు బయోటిన్ సంవృద్దిగా ఉన్నాయి. అస్తమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడుతోంది. బాగా పండిన అరటి పండులోని పోషకాలు .. పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉన్న పిండి పదార్ధాలు పక్వానికి వచ్చే కొలదీ ఎక్కువగా ఉంటాయి. బాగా పండిన అరటి పండు శరీరానికి సరైన జీవక్రీయలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంటు అధికంగా ఉన్న కారణాన కణనష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత ద్యమేజీలు మరియు ప్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోటాషీయం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ధమనుల్లోని అడ్డంకులను సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సమర్దవంతంగా పని చేయడానికి తోడ్పడుతుంది. స్తోక్ మరియు హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. గుండెలలో మంటగా అనిపించినప్పుడు పండిన అరటి పండు తీసుకుంటే ఉపశమనంగా అనిపిస్తుంది. పండిన అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉన్న కారణంగా అనీమీయ సమస్యను తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న కారణంగా నీరసంగా అనిపించినప్పుడు పండిన అరటిపండు తీసుకుంటే త్వరగా శక్తి వస్తుంది. రెండు పండిన అరటి పండ్లు తీసుకుంటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయడనికి తగిన శక్తిని ఇస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతారు. క్యాన్సర్ తో పోరాడే శక్తి పండిన అరటి పండులో ఉంటుంది. అరటిపండు పై భాగంలో కనిపించే మచ్చలు ట్యూమర నెక్రోసిస్ ఫాక్టర్ ఏర్పాటు చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపే సంశ్ర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లు అల్సర్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్సర్ నుంచి యాసీడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్నక్రీయ సక్రమంగా జరిగేలా పండిన అరటి పండు తోడ్పడుతుంది. అయితే అరటిపండుని మధుమేహంతో బాధపడే వారు తీసుకోకూడదు. చక్కర స్థాయిలు అధిక మోతాదులో ఉండడం వలన వారికి అంట ఉపయుక్తం కాదు, మిగిలిన వారందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)