ఉత్తర అమెరికాలో తెలుగువారి అతి పెద్ద సంఘమైన తానా తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకే నని తానా మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి అయినా కోమటి జయరాం పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తో గుంటూరు లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార విశేషాలపై కొంతసేపు చర్చించుకున్నారు. ఉత్తర అమెరికాలో 35 సంవత్సరాలకు పైగా విద్య , సాంస్కృతిక , సాంఘిక రంగాల్లో విశిష్ట సేవలు తానా అందించడం జరుగుతుందని, భవిష్యత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నేతృత్వంలో తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు తానా సభ్యులు పూర్తిగా తమ మద్దతును ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా కోమటి జయరాం ఎంపీ రాయపాటి వివరించారు. ఉత్తర అమెరికాలో IT ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులు రేపు జరగబోవు ఎన్నికల్లో ఓటు వేసి తెలుగు దేశ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, అదే విధంగా ఇక్కడ ఉన్న తానా సభ్యులు గ్రామస్థాయిలో కి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన వివిధ రకాల సంక్షేమ పధకాల కార్యక్రమాలను, మరియు భవిష్యత్ అభివృద్ధి కోసం చంద్రబాబు సారధ్యం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలిపి వారికి చైతన్యపరిచి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా రాయపాటి సూచించారు.
