నవగ్రహాల విశిష్టత ఇది-తదితర ఆద్యాత్మిక వార్తలు

1.సూర్యుడు :
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని “వివస్వంతుడు (సూర్యుడు)” జన్మెంచెను
(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)
కశ్యపుని కొడుకు కనుక “కాశ్యపుడు” అని
అదితి కొడుకు కనుక “ఆదిత్యుడు” అని
అండమున మృతము లేనివాడు కనుక “మార్తాండుడు” అని నామములు వచ్చెను
సూర్యునకు సంజ్ఞాదేవికిని “వైవస్వతుడు” “యముడు” “యమున” లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు “శని” భగవానుడు జన్మించెను
యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2. చంద్రుడు :
అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను
(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)
సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
౩) కుజుడు :
శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా “కుజుడు”(అంగారకుడు) జన్మించెను
(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)
రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4. బుధుడు :
సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)
బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5. బృహస్పతి :
సురూప ఆంగీరసులకు “బృహస్పతి” జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)
ఇతని భార్య “తారాదేవి”
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
“గురుడు” అనెదరు
6. శుక్రుడు :
భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
“ఉశనుడు” జన్మించెను
(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)
కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెనుపరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని “శుక్రుడు” అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి “శుక్రచార్యునిగా” పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7. శని :
సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే “శని” ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను
(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)
ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8. రాహువు :
కశ్యప మహర్షికి సింహికకును “రాహువు” జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)
క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు “మోహిని”అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9.కేతువు :
విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరిఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి…నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరుఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును (అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను)
2. పుష్పశోభితం.. సుగంధభరితం
సంపెంగల సువాసన, మల్లెల గుబాళింపు, గులాబీల సోయగం, కనకాంబరాల కాంతులు, బంతిపూల రమణీయత, మందారాల మకరందం, కాకడాల వన్నె, సన్నజాజుల లాలిత్యం, చామంతుల చమక్కులు లక్ష్మీనారసింహునికి వినూత్న శోభ తెచ్చాయి.దాదాపు పద్దెనిమిది పైగా రకాల పూల పరిమళాలతో దేవేరుల సహిత శ్రీవారిని అర్చించారు. శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఉత్సవంగా శుక్రవారం పుష్పయాగోత్సవం భక్తులకు నేత్రపర్వంగా సాగింది.. ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులను వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు.
3. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు
అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో గత 40 రోజులకు హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు సమకూరింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్, ఈవో వి.త్రినాధరావుల సమక్షంలో హుండీ సొమ్మును శుక్రవారం లెక్కించారు. 263 గ్రాముల బంగారం, 1.055 కేజీల వెండి సమకూరిందన్నారు. అంతేకాకుండా యుఎస్‌ఏ, యుఏఈ, ఖతార్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, సింగపూర్‌ తదితర అనేక దేశాల కరెన్సీ నోట్లు కూడా వచ్చాయన్నారు. రద్దయిన పాత రూ.500 నోట్లు 46, రూ.వెయ్యి నోట్లు 6 వచ్చాయని అధికారులు వెల్లడించారు. ధర్మకర్తల మండలి సభ్యుడు కొత్త వెంకటేశ్వరరావు, ఆలయ సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
4. చురుగ్గా సీతారాముల కల్యాణ పనులు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 6 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం కానుండటంతో ఇంజినీరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 14న కల్యాణం ఉండగా దీనికి వారం రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరకట్టపై ఉన్న రామాయణ విగ్రహాలకు రంగులను తీర్చిదిద్దడంతో పాటు వాటి మరమ్మతులను దాదాపు పూర్తి చేశారు. సౌమిత్రి సదనం వద్ద పార్కును పది రోజుల్లోగానే సుందరంగా ముస్తాబు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. స్వాగత ద్వారాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం పడమర మెట్ల వైపున వెదురు తడికల పందిరి నిర్మాణ పనులు చేపట్టగా మాడ వీధుల్లో పూర్తిస్థాయిలో ఈ తరహా నీడను అందించే చర్యలు తీసుకోనున్నారు. గోదావరి తీరంలో చలువ పందిరిని నిర్మించనున్నారు. స్టేడియంతో పాటు మండపం వద్ద బారీకేడ్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉంది.
5. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 15వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ముందురోజు ఏప్రిల్ 14వ తేది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీమలయప్ప స్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.శ్రీరామ పట్టాభిషేక ప్రత్యేక కార్యక్రమాలుఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు.రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు.
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 30
182 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994).
1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు మరణం (జ.1908).
1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
2002 : ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షీ మరణం (జ. 1930)
2005 : భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).
2011 : ప్రఖ్యాత తెలుగు సినిమా హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945)
7. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
02 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 02 గంటల సమయం పడుతుంది300 రూ ప్రత్యేక ప్రవేశం కలిగినవారికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,216నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు
8. శుభమస్తు – నేటి పంచాంగం”
తేది : 30, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం{స్తిరవాసరే}
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 50 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 39 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 59 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)