ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు తెదేపానే గెలవాల్సిన అవసరముందన్నారు. ఆ చివర్లో తన నియోజకవర్గం కుప్పం నుంచి ఈ చివరన ఇచ్ఛాపురం వరకు మొత్తం తమదేనని, ఏమాత్రం అనుమానంలేదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని.. వేరే జిల్లాల ప్రజలు సైతం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
*నరసరావుపేటలో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు ప్రచారం
గుంటూరు జిల్లా నరసరావుపేట YSR కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సతీమణి డాక్టర్ లావు మేఘన శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ0లోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయసుధ మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
*చంద్రబాబు పై మోహన్ బాబు ఫైర్
వైసీపీ నేత మంచు మోహన్ బాబు కామెంట్స్.. ఏముంది చెప్పటానికి?నా మిత్రుడు ఉదయం నుండి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ అనటం తప్ప చంద్రబాబు నాయుడు మరేమీ చెప్పడు.అహంకారాన్ని వదలిపెట్టు చంద్రబాబు.నీకంటే నేనే ముందు తెలుగుదేశం పార్టీలో చేరాను.జగన్మోహన్ రెడ్డి పై 36 కేసులు ఉన్నాయంటున్నావు.కానీ 15 లేక 16 మాత్రమేనీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు.ఎదుటివారు బాగుంటే ఓర్వలేని చంద్రబాబు.నీకు కారెక్టర్ ఉందా చంద్రబాబు?తెలుగుదేశాన్ని లాక్కున్నావుమేము నీ వెంట రావటం మా తప్పు మళ్ళీ ఒప్పుకుంటాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు నీ వల్లనే.లాక్కున్నావు చంద్రబాబు తెలుగుదేశాన్ని.నీ కేసులలో ఇప్పటిదాకా స్టే లు ఎందుకు తీసివేయలేదు? ఎన్టీఆర్ మీద ప్రేమతో ఇంతవరకు ఏ కార్యకర్తగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించిన అన్న గారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించావు.చంద్రబాబుది కుటుంబ పరిపాలన.హరికృష్ణ కు నీవు ఏం చేశావో ఇప్పటికైనా ప్రజలకు చెప్పు.యూటర్న్ చంద్రబాబు.మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న నువ్వు మోడీ తో జతకట్టడం ఎంతవరకు సమంజసం?కేంద్రప్రభుత్వం నిధులకు లెక్కలు చెప్పవద్ద? నువ్వు ప్పవా?జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి ఇది ప్రజలకు నేనిచ్చే సందేశంప్రజలకు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు.చదువు ఆరోగ్యం కోసం రాజశేఖర్ రెడ్డి గారు తాపత్రయ నిజంఆపధర్మ ముఖ్యమంత్రి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా ఇస్తారు.అమరావతి రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలని ఎంచుకోవడం న్యాయమేనా?ఆంధ్ర దేశాన్ని దోచేశావు చంద్రబాబు.కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తున్నాడు.నీ రాష్ట్రాన్ని నువ్వు బాగు చెయ్యి.ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి భయపడి పారిిపోయావు చంద్రబాబు నాయుడువైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించడం నాకు తెలుసు.చంద్రబాబు ఎన్ని మోసాలు అయిన చేస్తాడు.మీ డబ్బులు మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయండిపసుపుకుంకుమా మీడబ్బే మీకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ను నమ్మవద్దు
* ఎన్నికల ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ
ముందు రాష్ట్రంలో గెలిచి చూపించు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సవాల్ విసిరారు. నెల్లూరులో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని రాంమాధవ్ అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ తిరుగుతున్న చంద్రబాబు ముందు ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీయేనని, దేశ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని రాంమాధవ్ పేర్కొన్నారు. మోదీని తమ ప్రాంతం నుంచి పోటీ చేయాల్సిందిగా అన్ని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా రాంమాధవ్ విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా దక్కించుకోలేని కేసీఆర్ ప్రధానిని అవుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
* కాంగ్రెస్ పై విరుచుకు పడిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ సియాంగ్ జిల్లా, ఆలోలో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.రాహుల్, సోనియాలతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. బెయిలుపై ఉన్నప్పటికీ, కాపలాదారును నిందిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చుని, పన్నులు ఎగ్గొట్టే, రైతుల భూములను లాక్కొనే, పత్రికా కార్యాలయం కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని అద్దెకు ఇచ్చుకుని, డబ్బు సంపాదించే, రక్షణ ఒప్పందాల్లో కమిషన్లు తీసుకునే నాయకులు ఉన్నారన్నారు. ఆ నాయకులకు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయట తిరుగుతున్నారన్నారు. వెంట్రుక వాసిలో (జైలు) జీవితాన్ని తప్పించుకున్నారన్నారు. తామే స్వయంగా బెయిలుపై ఉన్నవాళ్ళు కాపలాదారును నిందిస్తున్నారని దుయ్యబట్టారు.అరుణాచల్ ప్రదేశ్ను, ఈశాన్య భారత దేశాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మోదీ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్కు ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరమని నిపుణులు చాలా దశాబ్దాల నుంచి చెప్తున్నారని గుర్తు చేశారు. నిపుణులు ఎంతగా చెప్తున్నప్పటికీ ఉన్నత వంశ కుటుంబం, ఆ కుటుంబానికి సన్నిహితులు తమ సొంత ఇలాకాను సృష్టించుకోవడానికే సమయాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వారు అరుణాచల్ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సంక్షేమం కన్నా తమ సొంత లాభం కోసమే వారు పాటుపడుతున్నారన్నారు.ఇటీవల విజయవంతమైన యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష గురించి తాను ప్రకటించినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మోదీ అన్నారు. పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం నిర్వహించిన దాడుల విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే, వారిని ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేస్తున్నారన్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడం మన దేశానికి గర్వకారణమని చెప్పారు. అది మింగుడుపడని ప్రతిపక్ష నేతలు ఉగ్రవాదుల భాష మాట్లాడుతున్నారన్నారు. ఆ నేతలను మన దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిని పాకిస్థాన్లో ప్రశంసిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ వార్తా పత్రికల్లో మన దేశ ప్రతిపక్ష నేతల ఫొటోలను ప్రచురించారన్నారు.మన దేశ ప్రతిపక్ష నేతలకు పొరుగు దేశంపై చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని, మన దేశాన్ని ప్రశంసించలేనంత స్థాయిలో పొరుగు దేశాన్ని ప్రేమిస్తున్నారని మండిపడ్డారు.
*వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
ప్రధాని మోడీ తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. సన్ సెట్ ఏపీ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు. కస్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రం పై ఇంత అక్కసా అంటూ నిలదీశారు. కర్నూలులో మోడీ సభకు వైకాపా తన కార్యకర్తలను తరలించిందన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇంకా కక్ష సాదిస్తున్నారని ధైర్యముంటే చెప్పినదానికి చేసిన దానికి శ్వేతపత్రం ఇవ్వలని భాజపాని డిమాండ్ చేసారు. లేదంటే తామే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు,. మోడీని జగన్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అవినీతిపరులకు ప్రధాని రెడ్ కార్పెట్ వేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
*ఎస్పీ- బీఎస్పీ కూటమికి బీటలు
ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన గట్ బంధన్ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నం పై పోటీ చేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమితో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్ గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తు పావు పోటీ చేయాలనీ సంజయ్ నిషాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిషాద్ పార్టీ అద్యక్షులు సంజయ్ నిషాద్, ఆయన కుమారుడు ప్రవెన్ నిశాద్ శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ను కలిశారు. ఈ పరినామలాతో నిశాద్ పార్టీ భాజపా కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
*కరీంనగర్ లో కారెం అల్లుళ్ళు
కరీంనగర్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి బరిలో దిగారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామ అల్లుడీయన. కోరెం గ్రామానికి చెందిన చేన్నాడి హన్మంతరావు , చేన్నాడి సత్యరాయణరావు స్వయానా సోదరులు. సత్యనారాయణరావు లచ్చంమల కుమార్తె వినోద ను విద్యాసాగరరావు వివాహం చేసుకున్నారు. చేన్నాడి హన్మంతరావు-శాంతమ్మల కుమారుడైన చేన్నాడి మార్తాండరావు కుమార్తె డాక్టర్ మాధవిని వినోద్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు అల్లుళ్ళు, కరీంనగర్ ఏమ్పీలుగా ఎన్నిక కావడం యాదృచ్చికం చెన్నమనేని విద్యాసాగర్ రావు 1998-99,1999-2004… ఈ రెండు పర్యాయాలు భాజపా నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచినా వినోద్ కుమార్ ఇప్పుడు మరోసారి బరిలో ఉంటున్నారు. వినోద్ కుమార్ కు విద్యాసాగర్ రావు వరుసకు బాబాయి అవుతారు .
* మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు – కేటీఆర్
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదన్నారు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది, కానీ డబ్బులు జమ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్లో ఉన్నది. టీఆర్ఎస్ ఎంపీలు గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటున్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
* విజయలక్ష్మీ, షర్మిలపై అనురాధ విమర్శలు
విజయలక్ష్మీ, షర్మిలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి షర్మిలకు ఎంత ప్యాకేజీ ముట్టిందని ప్రశ్నించారు. లోకేష్ గురించి దుర్భాషలాడటం తగదని హితవు పలికారు. విజయలక్ష్మీ, షర్మిల పోటీ చేయడానికి పనికిరారన్నారు. ఎదుటివారిపై బురదజల్లేందుకు మాత్రమే పనికొస్తారని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ లేక.. దళిత బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.
* అమిత్షా నామినేషన్ దాఖలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందుకు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించారు. అమిత్షా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఉన్నారు.
* 6నెలల్లో 3లక్షల ఉద్యోగాలు భర్తీ: పవన్
రాయలసీమ నుంచి వలసలు నివారించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్ రోడ్షో నిర్వహించారు. బొమ్మల సత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలతో సంజీవనగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్కు చేరుకొని ప్రసంగించారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ముద్ర కాకుండా రతనాల సీమగా మార్చేందుకు అందరూ నాంది పలకాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే 18 నెలల్లో సాగునీటి కష్టాలు తీరుస్తామని.. 6 నెలల్లో తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
* మూడు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన మార్పులు
అధికారం, అహంకారంతో విర్రవీగే వాళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటుంటే అవి ఇవ్వకుండా ఆదాయం కోసం మద్యం దుకాణాలు ఎక్కడికక్కడ నెలకొల్పుతున్నారని విమర్శించారు. ‘‘తెరాస చెబుతున్నట్లు ఇది సారు.. కారు.. సర్కారు కాదు. బారు.. బీరు.. సర్కారు’’ అని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
* మోదీకి వ్యతిరేక పవనాలు: కనకమేడల
దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, యూపీలో సైతం ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. యూపీలో గత ఎన్నికల్లో ముస్లింలను మభ్యపెట్టి ఎక్కువ సీట్లు సాధించారని చెప్పారు. అమరావతిలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టాయి. బిహార్లో నితీశ్ కుమార్తో భాజపా కూటమి కట్టినా ఆ పొత్తుపై అంత నమ్మకం లేదు.
* టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఇందులో.. టీడీపీలో తనకు సుముచిత స్థానం కల్పించి గౌరవించినందుకు సాయి ప్రతాప్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజంపేట లోక్సభ స్థానం నుంచి పలుమార్లు గెలుపొందిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సాయి ప్రతాప్.. ఆ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు.
* నిరుద్యోగ భృతికి జగన్ మోకాలడ్డు: యనమల
నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతికి కూడా జగన్ మోకాలడ్డుతున్నారని మంత్రి యనమల విమర్శించారు. పెంచిన రూ.2 వేలు యువతకు అందకుండా వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. పాత స్కీముకు కూడా ప్రతిపక్షం అడ్డంకుల పెడుతోందని చెప్పారు. అలాంటి పార్టీకి యువతరం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పసుపు-కుంకుమ చెల్లింపునకు కూడా జగన్ అడ్డంకులు గురిచేస్తు్న్నారని మండిపడ్డారు.
* మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మోదీపై ఓ మాజీ బీఎస్ఎఫ్ జవాన్ పోటీకి దిగారు. పాకిస్తాన్-భారత్ సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నాణ్యత లేని ఆహారం సరఫర చేస్తున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం రేపిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వారణాసి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా రాజకీయ పార్టీలు తనను వారణాసి నుంచి పోటీ చేయాలని కోరాయని, కాని తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో ప్రధానిపై పోటీ చేస్తాని తేజ్ బహదూర్ తెలిపారు.
* నల్లగొండలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో డీసీసీబీ డైరెక్టర్, తిప్పర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్ చింతకుంట్ల రవీందర్ రెడ్డి, అంతయ్యగూడెం సర్పంచ్ సిరిగిరి వెంకట్రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు. వీరందరికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
* డీఎంకే నేత ఇంట్లో ఐటీ సోదాలు
ద్రవిడ మున్నేత్ర కజగం(డీఎంకే) కోశాధికారి దురై మురుగన్ నివాసాల్లో ఇవాళ ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెల్లోర్ జిల్లాలోని కాట్పాడిలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 10.30 డీఎంకే నేత ఇంటికి వచ్చిన అధికారులు శనివారం కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు. మురుగన్ కుమారుడు కాతిర్ ఆనంద్ ఈసారి వెల్లోర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఐటీ శాఖ ఉద్యోగులు అయిదు బృందాలుగా మారి సోదాలు చేస్తున్నారు. గురువారం ఐటీ శాఖ అధికారులు కర్నాటక మంత్రి పుట్టరాజు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.
*ప్రచార బాద్యతల నుంచి వైదొలిగినా ప్రశాంత్ కిషోర్
మరో రెండు వారాలలోపే లోక్ సభ తొలిదశ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీహార్ అధికార జనతా దళ్ – యునైటెడ్ లో ముసలం ఏర్పడింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ నిర్వహణ ప్రచార బాద్యతల నుంచి వైదొలిగారు శుక్రవారం ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. జేడీయు నేత, రాజ్యసభ సభ్యుడు రాం చంద్ర ప్రసాద్ సింగ్ ఈ బాద్యతలు చూస్తారని పేర్కొన్నారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పార్టీలో ఎటువంటి కీలక బాద్యతలు అప్పజేప్పక పోవడం పై కిషోర్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా తోలి అడుగులు వేస్తున్నందున పార్టీలో తన పాత్ర కేవలం నేర్చుకోవడానికి సహకారం అందించడానికి మాత్రమే పరిమితమవుతుందని ఆయన చెప్పారు. మహాకూటమి నుంచి తప్పుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏ లోకి వెళ్ళే కన్నా తాజాగా ప్రజాతీర్పు కోరి ఉండాల్సిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
*అన్న విన్నారు… ఆదుకున్నారు!-లక్కిరెడ్డిపల్లెలో పింఛన్ల పథకం ప్రకటన
పండుటాకులు, వితంతువుల జీవితాల్లో వెలుగుపూలు పూయిస్తోన్న పింఛను పథకానికి నాంది ప్రస్తావన ఎక్కడ జరిగిందో తెలుసా… కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెలో. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కదిలించిన అలనాటి పరిస్థితులు ఇందుకు ప్రాతిపదికలయ్యాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజులవి. 1983 ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్కిరెడ్డిపల్లెకు వెళ్తున్నారు. చైతన్యరథంలో ఆయనతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ (తర్వాతికాలంలో ఈ స్థానం రద్దయింది) తెదేపా అభ్యర్థి ఆర్.రాజగోపాల్రెడ్డి ఉన్నారు. వృద్ధులు, వితంతువుల బాగోగులను పిల్లలు పట్టించుకోవడం లేదని, కరవు ప్రాంతంలో వారి బతుకులు దయనీయంగా ఉన్నాయని, ఐదు వేళ్లు వారి నోటిలోకి వెళ్లాలంటేనే కష్టంగా ఉందని, ప్రతినెలా ఎంతో కొంత పింఛనుగా ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని… ఎన్టీఆర్కు రాజగోపాల్రెడ్డి వివరించారు. ఈ మాటలు విన్న ఎన్టీఆర్ కదిలిపోయారు… ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ… తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు పింఛను ఇస్తామని, వారి జీవితాలను బాగు చేస్తామని ప్రకటించారు. ఆయన అధికారంలో వచ్చారు. ఆయన మంత్రివర్గంలో రవాణా, వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల బాధ్యతలను ఆర్.రాజగోపాల్రెడ్డి చూశారు. ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీఆర్ నెలకు రూ.30 పింఛన్ ప్రకటించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.50 చేశారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పింఛను మొత్తం రూ.75కు పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పింఛన్ను… చంద్రబాబు 2014లో రూ.1,000కి, 2019లో రూ.2,000కు పెంచారు. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు ఆ సొమ్ము భరోసా ఇస్తోంది.
*అమ్మమ్మ ఊర్లో ఉత్తమ్ సందడి
టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దేవరకొండ నియోజకర్గంలో పర్యటించారు. దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో సందడి చేశారు. తన తల్లిదండ్రులు పురుషోత్తంరెడ్డి, సువర్ణమ్మలతో కలిసి.. తాత తుమ్మలపల్లి చల్మారెడ్డి, అమ్మమ్మ హాల్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
*రాజకీయం’ కోసమే హిందూత్వ ఉగ్రవాద ముద్ర
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా మొత్తం హిందువులందరిపైనా హిందూత్వ ఉగ్రవాదమనే ముద్రను వేసినట్లు భాజపా ఆరోపించింది. హిందూ ఉగ్రవాదమనే రాజకీయ కుట్రను సుస్థిరం చేసే దిశగానే సంఝౌతా పేలుడు ఘటనలో దర్యాప్తు సాగినట్లు ఆ కేసులో వెలువడిన తీర్పు స్పష్టం చేసిందని పేర్కొంది. భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్జైట్లీ శుక్రవారం రక్షణమంత్రి నిర్మలాసీతారామన్, మరోనేత అనిల్ బలూనితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*జగన్కు ఒక్కసారి అవకాశమివ్వండి
ఎన్నికల్లో విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు… శుక్రవారం ఆమె కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పే స్థితిలో లేరన్నారు. ఇన్నాళ్లూ జగన్ నామజపం చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ఆర్ పాలన రావాలంటే అది జగన్తోనే సాధ్యమని తెలిపారు. తెదేపా అరాచకాలకు దీటైన జవాబు చెప్పాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా… ఒక్కసారి జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వండి’’ అని విజయమ్మ కోరారు.
*వారణాసికి మోదీ చేసిందేమిటి!
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై పోటీకి సైతం వెనుకాడేదిలేదని పరోక్షంగా తెలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా వారణాసి బరిలో దిగేందుకు సుముఖంగానే ఉన్నట్లు బలమైన సంకేతాలను ఇచ్చారు. శుక్రవారం అయోధ్యలో పర్యటించిన ఆమె… మోదీ ప్రాతినిధ్యం వస్తున్న వారణాసిలో అభివృద్ధిలేమికి సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రపంచమంతా చుట్టి వస్తున్న మోదీ తన సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
*ఓటమి భయంతో ప్రధానికి వణుకు
‘సూర్యోదయాన్ని ఇస్తారని నమ్మి మోసపోయాం. అందుకే మీ పార్టీని అస్తమించేలా చేసేందుకు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ సఖ్యత చూసి మీకు ఓటమి భయంతో వణుకుపుడుతోంది’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు ప్రధాని మోదీకి శుక్రవారం రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా చరిత్రలో ప్రధాని హోదాలో వచ్చిన మొదటి వ్యక్తి నేను అని గొప్పలు చెప్పుకొంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని ప్రోత్సహించి ప్రధానిని చేసిన చరిత్ర తెదేపాదని పేర్కొన్నారు. ‘
*కేసీఆర్, భాజపాతో పొత్తు లేదు
మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటంలో మంచి వైపు నిలిచి జగన్మోహనరెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని వైకాపా రాష్ట్ర నాయకురాలు షర్మిల కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం ఆమె బస్సుయాత్ర ప్రారంభించారు. మంగళగిరి జామియా మసీదు కూడలిలోనూ రాత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలనిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని.. రైతులు, చేనేత, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని వివరించారు. కేసీఆర్, భాజపాతో తమకు ఎలాంటి పొత్తు లేదని, సింహం ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు పాలన అక్రమాలను పరిశీలించి న్యాయం చేస్తారని తెలిపారు.
*పోటీలో ఉన్నది మా అభ్యర్థులు కాదు
ప్రజాశాంతి తరఫున నామపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపాకు చెందిన వారు సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారన్నారు. తెదేపా 38 మందిని వైకాపా 11 మందిని అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ.లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు, జగన్లు ఇద్దరూ తోడుదొంగలని ఆయన అభివర్ణించారు.
*మోదీ, కేసీఆర్ల పాలనకు చరమగీతం
కేంద్రంలో మోదీ పాలనకు, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే వ్యూహాత్మకంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వ్యవహరించామని తెదేపా రాష్ట్రాధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. కాంగ్రెస్ కోరిన మేరకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తెదేపా ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం ఘనంగా నిర్వహించింది.
*11నే నిజామాబాద్లో పోలింగ్: ఎంపీ కవిత
లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11నే జరుగుతాయని నిజామాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి, ఎంపీ కవిత ఓటర్లకు చెబుతున్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పలు సమావేశాల్లో మాట్లాడారు. ఎన్నికల బరిలో 185 మంది ఉండడంతో ఎన్నిక జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనేది ప్రస్తుతం జిల్లాఅంతటా చర్చ జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవిత తన ఎన్నికల ప్రచారంలో మొదట నిర్ణయించిన దాని ప్రకారం ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. అది కూడా బ్యాలెట్ రూపంలో ఉంటుందని చెబుతున్నారు.
*రేపు ఏపీకి రానున్న రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం విజయవాడ రానున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తెలిపారు. స్థానిక అజిత్సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొంటారని వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చేందుకే రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ వంటి స్వతంత్ర వ్యవస్థల ప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోదీ దిగజార్చారని, ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని పళ్లంరాజు అభిప్రాయపడ్డారు.
*నాలోనూ సీమ పౌరుషం
‘జనసేన, తెదేపాకు పొత్తు ఉందంటున్నారు. మరి అమిత్షా, తెరాసతో జగన్ భాగస్వామ్యాన్ని ఏమనాలి? రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కానప్పటికీ నాకూ సీమ పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు’ అని జగన్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు పట్టణాల్లో పర్యటించారు.
*కేసీఆర్ ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది
ఈ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు మారబోతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జోస్యం చెప్పారు. దిల్లీపై గులాబీజెండా ఎగురబోతోందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ప్రధాని కావాలని యావత్తు దేశం కోరుకుంటుందన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభను శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు.
*మాజీ మంత్రి హరీశ్కు తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా తూప్రాన్లో శుకవ్రారం రాత్రి నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నాయకులకు ప్రమాదం తప్పింది. 8 గంటల సమయంలో తూప్రాన్ పురపాలక కార్యాలయం వద్ద ప్రచారరథం నుంచి మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగిస్తున్న సమయంలో అదే ప్రచార రథం జనరేటర్లో పొగలు వ్యాపించి డీజిల్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి రెండు నిమిషాల ముందు ప్రచార రథానికి సంబంధించిన విద్యుత్తు లైట్లు నిలిచిపోయాయి. డీజిల్ అయిపోవడంతో అలా జరిగిందని అంతా భావించారు.
*ఎన్నికల విధుల్లో ఉండగా అపవాదులా!
తన భూమిని వేరొకరి పేరుపై పట్టా చేశారంటూ శరత్ అనే యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు.. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి, రెవెన్యూ ఉద్యోగులకు మధ్య వివాదాన్ని రాజేశాయి. రెవెన్యూ ఉద్యోగులపై అపవాదు మోపారంటూ రెవెన్యూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలతోపాటు పలు జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్రెడ్డి, నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నాయి.
*16వ లోక్సభలో.. 146 మంది వ్యవసాయదారులే
ప్రస్తుతం గడువు తీరనున్న 16వ లోక్సభకు ఎన్నికైన వారిలో 146 మంది సభ్యులు తమ వృత్తిని వ్యవసాయం, వ్యవసాయ సంబంధితంగా చూపారు. ఆ తర్వాత స్థానంలో సామాజిక కార్యకర్తలు 89 మంది ఉన్నారు. వ్యాపారులు 72 మంది, న్యాయవాదులు 54 మంది, రాజకీయ సామాజిక కార్యకర్తలు 38, వైద్యులు 27, పారిశ్రామికవేత్తలు 5 మంది, రైతులు ఏడుగురు ఉన్నారు. అతి తక్కువగా చార్టర్డ్ అకౌంటెంట్, వ్యూహకర్త, క్రీడాకారులు ఒక్కొక్కరే ఉన్నారు. మిగతా సభ్యులు వివిధ వృత్తుల వారు ఉన్నారు.
*ప్రచార సామగ్రి @ కేరళ ఫ్యాన్సీ
భారత్లో ఎన్నికలకు పర్యాయపదంగా ‘ఓట్ల పండగ’ అని చెబుతుంటాం. కేరళలోని ఓ దుకాణానికి వెళితే.. ఎన్నికలను ఓట్ల పండగ అనడం సబబే అనిపిస్తుంది. వేర్వేరు రాజకీయపార్టీల జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రితో అక్కడంతా రంగులమయంగా ఉండడమే ఇందుకు కారణం. కేరళలోని త్రిశూర్ జిల్లా పుత్తేన్పల్లిలోని ఓ దుకాణం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కిటకిటలాడుతూ కనిపిస్తుంది. జమాల్ అనే వ్యక్తి 30 ఏళ్లుగా ‘కేరళ ఫ్యాన్సీ’ పేరుతో ఈ దుకాణంలో.. వివిధ పార్టీల ప్రచార సామగ్రిని విక్రయిస్తున్నారు.
*నిజామాబాద్లో భారీ ఈవీఎంలు
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 185 మంది పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎన్నిక ఏ పద్ధతిలో నిర్వహించాలన్న విషయమై శుక్రవారానికి కూడా స్పష్టత రాలేదు. బ్యాలెట్ పత్రం ద్వారా నిర్వహించాలా? దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆధునిక యంత్రాలను తెచ్చి ఎన్నిక నిర్వహించాలా? అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నవారిలో ఎక్కువ మంది పసుపు, ఎర్రజోన్నల రైతులన్న విషయం తెలిసిందే.
*పాలనను కేసీఆర్ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే. వారు కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారు. పేదలు, దళితులు, పీడితుల అభివృద్ధి గురించి ఎన్నడూ మాట్లాడరు
*ఎన్నికల తరువాత భాజపా దుకాణం బంద్
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలైన భాజపాకు 150కి మించి సీట్లు రావు. కాంగ్రెస్ సీట్లు 100కు మించవు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమైన ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే .ఓట్లు, అధికారం కోసం దేశ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో దేశంలోని రైతులు, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల(బీసీ)కు చేసిందేమీ లేదు. ఎన్నికల తర్వాత ఆ పార్టీని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.
*పాలనను కేసీఆర్ గాలికొదిలేశారు
శాసనసభ ఎన్నికలు ముందుగా జరగాలని ఎవరో జ్యోతిషుడు చెప్పారట. లోక్సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగితే మోదీ కŸరిష్మాతో ఆ పార్టీ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లో కూడా మునిగిపోతుందని సలహా ఇచ్చారట. ఏప్రిల్, మే సమయంలో మోదీ అంటే భయంతో శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? జ్యోతిషుడు నిర్ణయిస్తారా? దేశరక్షణ, సమృద్ధి, గౌరవం ఇవి అభివృద్ధికి పునాదులుగా గౌరవించే కాపలాదారు ఓవైపు. మరోవైపు నాయకుడు ఎవరో తెలియదు.. నీతి అసలే లేదు. ఇక వారి సంకల్పం, నిబద్ధత గురించి ఈ దేశంలో ప్రజలందరికీ తెలిసిందే.
*సభ్యత్వాల రద్దుకు పోరాటం
తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యేలా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పూర్తి ఆధారాలతో శాసనసభ సభాపతిని కలసి అనర్హతవేటు వేయాలని పిటిషన్ అందజేస్తారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఇందుకోసం ప్రయత్నించగా సభాపతి అసెంబ్లీలో లేరు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. నిబంధనల మేరకు అనర్హత పిటిషన్ను సభాపతికే ఇవ్వాలి. త్వరలో ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అనర్హత పిటిషన్ అందచేస్తారు.
*బాబు ఎవరికి భద్రత ఇచ్చారు?
‘ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టు పట్టి ఈడ్చుకెళితే అధికారికి మద్దతిచ్చారా? లేదా ఆ ఎమ్మెల్యేపై కేసులు లేకుండా మద్దతిచ్చారా? విజయవాడలో కాల్మనీ వ్యవహారంలో బాధితురాళ్లకు మద్దతిచ్చారా? తెదేపా వారికా? ప్రతివారు భద్రంగా దాచుకునే ఆధార్, బ్యాంకు ఖాతాలను సేవామిత్ర యాప్ పేరుతో ప్రైవేటు కంపెనీలు, జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు.. చివరకు రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చారా? లేదా కొడుకు లోకేశ్కా?’ అని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
*‘గుర్తు’కొస్తున్నాయి..!-వైకాపాను కలవరపెడుతున్న హెలీకాప్టర్
జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఒకటే కావడం, వారికి కేటాయించిన గుర్తులు సారూప్యాన్ని కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. 1999 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని పలువురు నెమరు వేసుకుంటున్నారు. పెనమలూరు వైకాపా అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్న విషయం విదితమే. అలాగే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వేమూరి పార్థసారథి రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థుల ఇంటి పేరు వేరైనా ప్రధాన నామధేయం మాత్రం ఒక్కటే కావడం గమనార్హం.
*మా బీ ఫారాలు తెదేపా, వైకాపా వారు ఎత్తుకెళ్ళారు
ప్రజాశాంతి తరఫున నమపత్రాలు దాఖలు చేసి పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో చాలా మంది తమ అభ్యర్ధులుకరణి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవరమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా, వైకాపకు చెందిన వారు సిబ్బంది పై దాడి చేసి ప్రశాంతి బీ ఫారాలు ఎత్తుకెళ్ళి అభ్యర్ధులను నిలిపారని అన్నారు. తెదేపా 38 మందిని, వైకాపా పదకొండు మందిని అభ్యర్ధులను నిలిపిందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్ధులు బీ ఫారాలు తిరస్కరించిన అధికారులు వైకాపా, తెదేపా వారు నిపిన వారిని అనుమతించారని అన్నారు. అధికారులు వైకాపా తెదేపా వారు నిలిపిన వారిని అనుమతించారన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానన్నారు. రూ. లక్షల కోట్ల అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు జగన్ లు ఇద్దరూ తోడూ దొంగలని ఆయన అభివర్ణించారు.
